మొక్కజొన్న లోడ్ వేసుకుని ఓ లారీ పెట్రోల్ బంక్ లో ప్రవేశించింది.ఆకస్మాత్తుగా లారీ టైర్ పగలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
లారీ మొత్తం దగ్ధమైంది.దీంతో పెట్రోల్ బంక్ కి కూడా మంటలు వ్యాపించడంతో పెట్రోల్ లో రీడింగ్ మిషన్ కాలిపోయింది.
దీంతో ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
పెట్రోల్ బంక్ భారీ అగ్నిప్రమాదం సంభవించిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటు చేసుకుంది.
సూరారెడ్డిపాలెం సమీపంలో ఉన్న భారత్ పెట్రోల్ బంక్ లో ఓ లారీ మొక్కజొన్న లోడ్ తో డీజిల్ కోసం బంక్ లోకి ప్రవేశించింది.ఉన్నట్టుండి లారీ టైర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
లారీ మొత్తం వేగంగా మంటలు వ్యాప్తించి మొక్కజొన్న సంచులు దగ్ధమయ్యాయి.ఆ మంటలు ఎక్కువై పెట్రోల్ పంపు, రీడింగ్ మిషన్ కి మంటలు వ్యాపించాయి.
పక్కనే ఉన్న పెట్రోల్ ట్యాంకర్ కు మంటలు అంటుకోకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి.సుమారు రూ.10 లక్షల ఆస్తి నష్టం జరిగిందని అధికారులు తెలుపుతున్నారు.ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ కొనసాగించారు.