ప్రముఖ టాలీవుడ్ సినీ నటుడు పృథ్వీరాజ్ రోడ్డ ప్రమాదానికి గురయ్యారు.బంజారాహిల్స్లోని బసవతారకం హాస్పిటల్ వద్ద పృథ్వీ కారు ప్రమాదానికి గురైంది.
బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి వద్ద ఉన్న వినాయకుడి గుడి వైపు కారులో ఆయన ప్రయాణిస్తుండగా.మరో కారు వచ్చి ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో పృథ్వీకారు ధ్వంసం అయింది.ఈ సందర్భంగా జనం వచ్చి గుమిగూడారు.
ఈ ప్రమాదంలో పృథ్వీకి ఏమైనా అయిందా లేదా అనే విషయం మాత్రం ఇంకా బయటికి రాలేదు.ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఎలాంటి సమాచారం బయటకి రాలేదు.
దీంతో పృథ్వీ అభిమానులు ఆందోళనలో ఉన్నారు.దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా ఇటీవల పృథ్వీ కరోనా బారిన పడ్డారు.అనంతరం హైదరాబాద్లోని ఒక క్వారంటైన్ సెంటర్లో చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు.
కరోనా నెగిటివ్ రావడంతో తనను డిశ్చార్జ్ చేశారని, ప్రస్తుతం తన ఆరోగ్యం పరిస్థితి బాగానే ఉందని అప్పట్లో పృథ్వీ చెప్పాడు.
టాలీవుడ్లో థర్టీ ఇయర్స్ అనగానే అందరికీ పృథ్వీ గుర్తుకొస్తాడు.
సినిమాల్లో కమెడియెన్గా మంచి పేరు తెచ్చుకున్న ఆయన.రాజకీయాల్లోకి కూడా ప్రవేశించిన విషయం మనందరికీ తెలిసిందే.
గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి ఆ పార్టీ తరపున ఎన్నికల ప్రచారం చేశారు.వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పృథ్వీకి టీటీడీ భక్తి ఛానెల్ ఛైర్మన్ పదవి దక్కగా.
అది మున్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది.