రేణుదేశాయ్ రెండవ పెళ్లికి సిద్దం అయ్యింది.ఈమె ఇటీవలే నిశ్చితార్థం కూడా చేసుకున్న విషయం తెల్సిందే.
రేణుదేశాయ్కి మొదటి భర్త పవన్ కళ్యాణ్ ద్వారా ఇద్దరు పిల్లలు ఉన్న విషయం కూడా అందరికి విధితమే.కొడుకు అకీరాకు తల్లి రేణుదేశాయ్ వివాహం చేసుకోవడం సుతారం ఇష్టం లేదని, తల్లి పెళ్లి చేసుకోబోతున్న కారణంగానే తండ్రి వద్దకు వెళ్లి పోయాడు అంటూ పుకార్లు షికార్లు చేశాయి.
తల్లి వివాహ సమయంలో అతడు ఆమె వద్ద ఉండేందుకు ఆసక్తి చూపించడం లేదు అంటూ మీడియాలో వార్తలు వచ్చాయి.అయితే ఆ వార్తపై రేణుదేశాయ్ స్పందించింది.
తన కొడుకుకు నేను వివాహం చేసుకోవడం ఇష్టం లేదంటూ మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదని, అతడితో మాట్లాడిన తర్వాతే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా గతంలో చెప్పుకొచ్చింది.తాజాగా మరోసారి కూడా అకీరాకు తాను పెళ్లి చేసుకోవడం ఇష్టమే అంటూ చెప్పుకొచ్చింది.సోషల్ మీడియాలో ఈమద్య కాలంలో పదే పదే నెటిజన్స్ ఆమెను ఈ విషయమై ప్రశ్నించగా, ఆమె మళ్లీ మళ్లీ సమాధానం చెప్పడం చేస్తుంది.దాంతో ఇప్పుడు కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
పదే పదే ఒక అబద్దంను నిజం చేయాలని రేణుదేశాయ్ చూస్తుందా అంటూ కొందరు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
రేణుదేశాయ్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది.
ఆమె పలు విషయాలపై ముక్కుసూటిగా స్పందిస్తూ వస్తుంది.తాజాగా పవన్ ఫ్యాన్స్ తన పెళ్లి విషయంలో ఇబ్బందిగా కామెంట్స్ చేస్తున్నారనే ఉద్దేశ్యంతో ట్విట్టర్ను వదిలేసింది.
తాజాగా అకీరాకు వివాహం ఇష్టమేనా అంటూ నెటిజన్స్ ప్రశ్నించిన సమయంలో పదే పదే వారిద్దరికి ఇష్టమే అంటూ చెప్పడంలో ఉద్దేశ్యం మరేదైనా ఉందా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఆ ప్రశ్నకు రేణు మరీ అంతగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి రేణుదేశాయ్ రెండవ పెళ్లి వ్యవహారం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది.పూణెకు చెందిన వ్యక్తితో గత కొంత కాలంగా రేణదేశాయ్ చాలా సన్నిహితంగా ఉంటూ వస్తుంది.
ఇప్పుడు అతడినే వివాహం చేసుకునేందుకు సిద్దం అయ్యింది.రెండు నెలల్లో వివాహంకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.