ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి పేరు మొత్తం తెలుగు రాష్ట్రాల్లో మార్మోగుతోంది.మెగా వారసుడు వైష్ణవ్ తేజ్ దర్శకుడు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు డైరెక్షన్లో హీరోయిన్ కృతి శెట్టి కథానాయికగా ఉప్పెన సినిమా విడుదలైన విషయం తెలిసిందే.
ఈ సినిమా విడుదలైన తర్వాత బ్లాక్ బస్టర్ సినిమాగా మారి పెద్ద ఎత్తున కలెక్షన్ కొల్లగొడుతున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం.ఈ ఒక సూపర్ హిట్ టాక్ రావడంతో సినిమా బృందం ఒక్కొక్క ప్రముఖ నగరంలోని థియేటర్లో అభిమానుల మధ్య సినిమా చూస్తూ అభిమానుల మధ్య సినిమా సక్సెస్ ని ఆస్వాదిస్తున్నారు.
అయితే ఈ సమయంలో హీరోయిన్ కృతిశెట్టికి సంబంధించిన ఓ వార్త వైరల్ గా మారుతోంది.
ఇక అసలు విషయం లోకి వస్తే కృతిశెట్టి రెమ్యునరేశన్ విషయం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఉప్పెన సినిమాకు 6 లక్షల పారితోషికం తీసుకున్న ఈ కృతి శెట్టి, ఇప్పుడు ఉప్పెన సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఇప్పుడు తను భవిష్యత్తులో సైన్ చేయబోయే సినిమాలకు 60 లక్షల పారితోషికం డిమాండ్ చేస్తున్నదని సినీ వర్గాలలో వార్త హల్ చల్ చేస్తోంది.అయితే ఒక సినిమా హిట్ కే ఇంతలా పారితోషికం పెంచేసిందా అని సినీ వర్గాలు కూడా ఆశ్చర్యపోతున్నారు.
ఇక ముందు ముందు మరిన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ అయితే ఒక కోటి రూపాయల పారితోషికాన్ని డిమాండ్ చేసే అవకాశం కూడా ఉంది.ఏది ఏమైనా మొత్తానికి 17 ఏళ్ల వయసులోనే మొదటి సినిమాతోనే సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా పేరు పొందిన కృతిశెట్టి భవిష్యత్తులో మరిన్ని నటన ప్రాధాన్యత పాత్రలను ఎంచుకుంటూ ఉంటే తెలుగు ప్రేక్షకులు ఈ హీరోయిన్ అక్కున చేర్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.