మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో నకిలీ స్వామిజీ వ్యవహారం బట్టబయలు అయింది.క్షుద్రపూజల పేరుతో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడంతో మహిళా సంఘాలు స్వామిజీకి దేహశుద్ది చేశారు.
అనారోగ్యం కారణంగా తన దగ్గరకు వచ్చిన మహిళలను నగ్న వీడియోలు తీసి వేధింపులకు గురి చేసినట్లు తెలుస్తోంది.దాంతో పాటు తాయత్తులు కట్టి మహిళను లోబరుచుకుని పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని సమాచారం.
దీంతో ఓ బాధితురాలు మహిళా సంఘాలను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.