టీడీపీ నేత నారా లోకేశ్ చేపట్టనున్న ‘యువగళం’ పాదయాత్ర మరికాసేపటిలో ప్రారంభం కానుంది.దీంతో ఏపీ నలుమూలల నుంచి టీడీపీ శ్రేణులు కుప్పం చేరుకున్నారు.
ఎక్కడికక్కడ లోకేశ్ కటౌట్లు, పార్టీ జెండాలు, భారీ బెలూన్లు ఏర్పాటు చేశారు.దీంతో కుప్పం ప్రాంతమంతా పసుపుమయంగా మారింది.
మరోవైపు లక్ష్మీపురం ప్రసన్నవరద స్వామి ఆలయానికి ఇప్పటికే చేరుకున్న లోకేశ్ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.పూజల అనంతరం ఆయన పాదయాత్రను ప్రారంభించనున్నారు.
యువతను కలుస్తూ .ప్రజా సమస్యలు తెలుసుకుంటూ సుమారు నాలుగు వందల రోజులపాటు నాలుగు వేల కిలోమీటర్ల మేర లోకేశ్ నడవనున్నారు.
కాగా, మధ్యాహ్నం 3 గంటలకు టీడీపీ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.దీనికి బాలకృష్ణ, అచ్చెన్నాయుడు సహా పలువురు ముఖ్యనేతలు హాజరుకానున్నారు.ఈ మేరకు సభలో స్టేజీపై సుమారు నాలుగు వందల మంది నేతలు కూర్చునే విధంగా ఏర్పాట్లు చేశారు పార్టీ శ్రేణులు.అదేవిధంగా ఈ సభకు 50 వేల మంది వస్తారని అంచనా వేస్తున్నారు.