బిగ్ బాస్ సెకండ్ సీజన్ స్టార్టయి రోజులు గడుస్తున్నా సరైన మసాలా పడలేదని భావిస్తున్న ఆడియన్స్ కు సిసలైన విందు భోజనం రెడీ అయింది.ఇప్పటివరకు బిగ్ బాస్-2 నడిచింది ఒకెత్తు… ఇకపై నడిచేది మరో ఎత్తు అంటూ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కత్తులు నూరుతున్నారు.
తొలిరోజు నుంచి మొదటి వారం కంప్లీట్ అయ్యేవారకు వార్ వన్ సైడ్ అన్నట్టుగా ఉంది.సామాన్యుల కోటాలో బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన నూతన్ నాయుడు, గణేష్ ఏంమాట్లాడితే ఏం తంటా వస్తుందో అన్నట్టుగా సెలబ్రిటీల విషయంలో ఆచితూచి వ్యవహరించారు.
కానీ ఆడపిల్ల అయినా సంజన మాత్రం ఎక్కడా వెనక్కితగ్గకుండా దూకుడు ప్రదర్శించింది.కానీ దురదృష్టవశాత్తు ఆమె ఫస్ట్ వీక్ లోనే ఎలిమినేట్ అయింది.
ఇప్పుడు హౌస్ లో ఉన్న మిగిలిన కామన్ పీపుల్ లో నూతన్ నాయుడు, గణేష్ మిగిలారు.
అయితే బిగ్ బాస్ హౌస్ లో బిగ్ బాస్ హౌస్ లో తనీష్ కుట్రలు చేస్తున్నాడనే విషయం వైరల్ అవుతుందిఇంటిలోకి వచ్చినప్పటి నుంచి అందరిని తన చెప్పుచేతల్లో పెట్టుకోవటానికి ప్లాన్స్ వేస్తూనే ఉన్నాడు.హౌస్ లో బాగా యాక్టివ్ గా ఉండే తేజస్వితో జత కట్టి సామ్రాట్ ని చేరదీసి ఇంటి మొత్తాన్ని తన ఆధీనంలోకి వచ్చేటట్టు చేసుకున్నాడు.అంతేకాక కెప్టెన్ టాస్క్ లో అద్భుతమైన ప్రదర్శన చేసిన భాను శ్రీని కాదని తన మాట వినే సామ్రాట్ గెలిచేలా అందర్నీ ఒప్పించాడు.
కెప్టెన్ అయిన సామ్రాట్ కూడా ప్రతి విషయాన్నీ తనీష్ కి చెప్పి సలహా తీసుకుని మరీ చేస్తున్నాడు.
తనీష్ ఇంటిలో ఎవరు ఏ పని చేయాలో డిసైడ్ చేస్తున్నాడు.
బాత్ రూమ్ క్లినింగ్ వంటి పనులను నూతన్ నాయుడు,కౌశల్ కి అప్పగించటంతో వారికి కోపం వచ్చింది.తనీష్ ఏ పని చేయకుండా అందరి పనులను పర్యవేక్షణ చేస్తానని చెప్పటం కూడా ఇంటి సభ్యుల్లో ఆగ్రహం తెప్పించింది.
ప్రతి పని,ప్రతి టాస్క్ లో తనీష్ కుట్రలు పెరిగిపోవటంతో తనీష్ పై భాను శ్రీ,నూతన్,కౌశల్ చాలా కోపంగా ఉన్నారు.
భాను శ్రీ చెత్త పారవేయటంపై తేజస్వి నిలదీయగా ఇద్దరి మగాళ్లను వేసుకొని ఆటలు ఆడుతుందని భానుశ్రీ కామెంట్ చేయటంతో ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది.
ఆ ఇద్దరు తనీష్,సామ్రాట్ అనటంలో ఎలాంటి సందేహం లేదు.తనీష్ పై నూతన్ ఆగ్రహం వ్యక్తం చేసాడు.దాంతో రెచ్చిపోయిన తనీష్ నూతన్ పైకి దాడికి దిగాడు.వీరి మధ్య వ్యవహారం కొట్టుకొనే దాక వెళ్ళింది.
మధ్యలో కౌశల్ వచ్చి తనీష్ వ్యవహారం బాగా లేదని మండిపడ్డాడు.దాంతో తనీష్ కూడా కౌశల్ తో గొడవ పడ్డాడు.