తరుచుగా వివదాస్పద అంశాలతో వార్తల్లో ఉంటూ వస్తున్న నందమూరి బాలకృష్ణ, ఈమధ్య మరోసరి మరో వివాదాస్పద రీతిలో వార్తల్లోకి ఎక్కిన సంగతి విదితమే.ఉపఎన్నికల ప్రచారం కోసం నంద్యాల వెళ్ళిన బాలయ్య బాబు, అక్కడ దండ వేయడానికి వచ్చిన ఓ అభిమానిపై చేయి చేసుకున్న విడియో మీరు చూసే ఉంటారు.
ఈ సంఘటన జరగటానికి రెండు వారాల ముందే తన అసిస్టెంట్ చెప్పులు తీయలేదని అతనిపై కూడా చేయి చేసుకున్నారు బాలకృష్ణ.బాలకృష్ణ ప్రవర్తనపై నేషనల్ మీడియా కూడా స్పెషల్ ఎపిసోడ్స్ ప్రచారం చేసింది.
ఇందంతా ఒక ఎత్తు అయితే, మొన్న పైసా వసూల్ ఆడియో ఫంక్షన్ లో దర్శకుడు పూరి జగన్నాథ్ బాలకృష్ణని సమర్థిస్తూ, బాలకృష్ణకి అభిమాననులకి మద్య ఓ లవ్ స్టోరి ఉంది, ఆయన కొట్టినా తప్పుగా అర్థం చేసుకోకండి అంటూ మాట్లాడటం మరొక ఎత్తు.
పూరి జగన్నాథ్ వ్యాఖ్యలపై, బాలకృష్ణ పధ్ధతిపై టాలివుడ్ మొత్తం సైలంట్ గా ఉన్నా, సోషల్ మీడియా మాత్రం సైలెంట్ గా ఉండట్లేదు.
ఆ విమర్శనాస్త్రాల నడుమ సీనియర్ నటి కస్తూరి కూడా ఘాటైన విమర్శలు వదిలింది.
ఇటు బాలకృష్ణని అటు పూరి జగన్నాథ్ మీద కూడా ఓ దేబ్బెసారు కస్తూరి.
బాలకృష్ణని పూరి జగన్నాథ్ సమర్థిస్తున్న తీరు చూస్తే, ఆయనపై డ్రగ్స్ ఆరోపణలు రావడంతో ఎలాంటి తప్పు లేదు అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు కస్తూరి.
కస్తూరికి ఇలాంటి సూటిగా విమర్శలు చేయడం ఈమధ్య తరచుగా జరుగుతోంది.
ఆ మధ్య రజినీకాంత్ రాజకీయ రంగప్రవేశంపై కూడా విమర్శలు చేసింది కస్తూరి.ఆ తరువాత తనతో నటించిన ఓ తెలుగు సీనియార్ స్టార్ హీరో, తనతో ఫిజికల్ సంబంధం పెట్టుకునేందుకు ప్రయత్నించాడు అంటూ బాంబు పేల్చింది.
తాజాగా ఇలా బాలకృష్ణ – పూరిపై విమర్శలు చేసారు కస్తూరి.ఇటివలే శమంతకమణి సినిమాలో సుధీర్ బాబు తల్లి పాత్రలో కనిపించిన కస్తూరి బాలకృష్ణతో కలిసి నిప్పు రవ్వ అనే సినిమాలో నటించడం విశేషం.