రాజకీయాలకే రాజకీయం నేర్పగల మేధావి .వ్యూహకర్త , దేశ రాజకీయాలను సైతం ప్రభావితం చేయగల వ్యక్తి ఎవరన్నా ఉన్నారా అంటే అది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అనేది అందరూ అంగీకరించే నిజం.
ఎన్ని వడిదుడుకులు వచ్చినా సరే ఆయన ప్రభుత్వాన్ని, పార్టీని ధైర్యంగా ముందుకు నడిపించే తీరు చూస్తుంటే అతడు ఎంత సమర్ధుడో ఇట్టే అర్ధం అయిపోతుంది.ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం మాత్రమే ఉంది.
ఈ నేపథ్యంలో ఆయన పార్టీని, క్యాడర్ ను నడిపిస్తున్న తీరు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
బాబు ఎంత కష్టపడుతున్నా.కొంతమంది నాయకులు మాత్రం ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ప్రవర్తిస్తూ పార్టీ పరువును బజారున పడేస్తున్నారు.ఇటువంటి నాయకులను కట్టడి చేసేందుకు బాబు చక్కని ప్లాన్ అమలు చేసి వారిని దారిలో పెట్టగలిగారు.
ఇంతకీ విషయం ఏంటంటే.రాష్ట్రంలోన ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు అధికార పార్టీ అనే ధీమాతో ఎవరికీ వారు అనేక మార్గాల ద్వారా తమ జేబులు నింపుకుంటున్నారు అనేది అందరికి తెలిసిన వాస్తవం.
ఇసుక మాఫియా, దందాలు బాగా పెరిగిపోయాయని చంద్రబాబు కు కూడా నిత్యం ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి.ఈనేపథ్యంలో వాటికి అడ్డుకట్ట వేయాలని చంద్రబాబు నిర్ణయించారు.
నిన్న మొన్నటి వరకు పార్టీ నాయ కులను హెచ్చరించి, వార్నింగ్లు ఇచ్చిన చంద్రబాబు ఎన్నికల సమయంలో మాత్రం వారికి మార్కింగ్ ఇవ్వడం ద్వారా వారిని దారిలో పెట్టగలిగారు.ఇటీవల నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశం లో కూడా ఇదే తరహా వ్యూహాన్ని ప్రదర్శించారు.
తొలి 70 మార్కులు తెచ్చుకున్నవారి జాబితాలో దెందులూరు ఎమ్యెల్యే చింతమనేని ప్రభాకర్ను చేర్చడం ద్వారా ఆయన వల్ల పార్టీకి జరుగుతున్ననష్టాన్ని అడ్డుకోగలిగారు.అలాగే గన్నవరం ఎమ్మెల్యే వంశీ, గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర వంటి వారికి కూడా మార్కులు ఇచ్చి అసంతృప్తిని పోగొట్టారు చంద్రబాబు.
ఇలాగె చాలామంది ఎమ్యెల్యేలను మార్కుల విధానం ద్వారా ఆరిలో మార్పు తీసుకురాగలిగారు.
నాయకులు కష్టపడితేనే మార్కులు వస్తాయని, ఇలా మార్కులు వచ్చిన వారికే చంద్రబాబు దగ్గర గుర్తింపు ఉంటుందనే సంకేతాలను ఆయన చెప్పకనే చెప్పారు.
అంతేకాకుండా బాగా కష్టపడే గెలుపుగుర్రాలకే టికెట్ ఇస్తాను తప్ప అవినీతిలో పేరు తెచ్చుకున్నవారి కి ఈ సారి టికెట్ ఇచ్చేది లేదని ఖరాకండిగా చెప్పేయడంతో సిట్టింగ్ ఎమ్యెల్యేల్లో మార్పు కనిపిస్తోంది.చంద్రబాబా మజాకా !
.