వయస్సు మీద పడుతున్నా కూడా ఆ విషయాన్ని పట్టించుకోకుండా పని చేస్తే అనర్థాలు జరుగుతాయి.ఏ పని అయిన, ఏ విషయం అయినా కూడా వయస్సును బట్టి మసుకోవడం మంచిదని అంతా అంటూ ఉంటారు.
ఆరు పదుల వయస్సులో కూడా ప్రేమ కథల్లో నటిస్తాను, ఎగిరి దుంకుతాను అంటే ప్రేక్షకులు అంగీకరించరు.వయస్సుకు తగ్గట్లుగా సినిమాల్లో కూడా కనిపిస్తేనే ప్రేక్షకులు ఆధరిస్తారు అనే విషయాన్ని సీనియర్ హీరోలు మెల్ల మెల్లగా గుర్తిస్తున్నారు.
అందుకే నాగార్జున మరియు వెంకటేష్లు మల్టీస్టారర్ చిత్రాలు చేసుకుంటూ ఉన్నారు.
ఇప్పటికే వెంకటేష్ తన వయస్సుకు తగ్గ పాత్రలు చేస్తున్న విషయం తెల్సిందే.తాజాగా నాగార్జున కూడా వయస్సుకు తగ్గ పాత్రను ఎంపిక చేసుకుంటూ అందరిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు.ప్రస్తుతం వెంకటేష్ రెండు మల్టీస్టారర్ చిత్రాలను చేస్తున్న విషయం తెల్సిందే.
ఆ రెండు మల్టీస్టారర్ చిత్రాలు కూడా ఇదే సంవత్సరం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.ఇక ముందు కూడా వెంకటేష్ వరుసగా మల్టీస్టారర్ చిత్రాలు చేయాలని భావిస్తున్నాడు.
అందుకు సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నాయి.మల్టీస్టారర్ చిత్రాలు కాకున్నా కూడా వయస్సుకు తగ్గ పాత్రలను మాత్రమే చేస్తాను అంటూ వెంకీ చెబుతున్నాడు.
వెంకటేష్ దారిలోనే నాగార్జున కూడా నడిచేందుకు సిద్దం అవుతున్నాడు.నాగార్జున ‘ఊపిరి’ చిత్రం తర్వాత మల్టీస్టారర్ చిత్రాలను చేయడం లేదు.మళ్లీ ఇన్నాళ్లకు మల్టీస్టారర్తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు.నానితో ప్రస్తుతం మల్టీస్టారర్ చిత్రాన్ని చేస్తున్న నాగార్జున తాజాగా కళ్యాణ్ రామ్తో కూడా ఒక మల్టీస్టారర్ చిత్రాన్ని చేసేందుకు సిద్దం అయ్యాడు.
పవన్ సాదినేని దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్తో నిర్మించబోతున్న మల్టీస్టారర్ చిత్రం ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.విభిన్నమైన ప్రేమ కథతో ఈ చిత్రాన్ని దర్శకుడు పవన్ తెరకెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు.
అందుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి అయ్యింది.త్వరలోనే మల్టీస్టారర్ను సెట్స్ పైకి తీసుకు వెళ్లేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఇక ఈ చిత్రంతో నాగార్జున వరుసగా మల్టీస్టారర్ చిత్రాలను చేయడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు.మొత్తానికి ఈ వయస్సులో సోలో హీరోగా చేసి పోరాడంటం కంటే ఇలా యువ హీరోలతో కలిసి నటించడం మంచి నిర్ణయం అంటూ నాగార్జున మరియు వెంకటేష్లు తీసుకున్న నిర్ణయానికి అభినందనలు దక్కుతున్నాయి.