దుబ్బాక ఎన్నికల వేళ బీజేపీకి షాకిచ్చిన కీలక నేత

ఈ నెలలో దుబ్బాక ఉపఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.ఈ మేరకు నేటితో ఉపఎన్నికల ప్రచారం కూడా ముగిసింది.

 Ravula Sridhar Reddy Good Bye To Bjp, Dubbaka, Bjp,bye Elctions, Trs-TeluguStop.com

ప్రచారంలో రాజకీయ పార్టీల మధ్య తీవ్ర విమర్శలు, ప్రతివిమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో దుబ్బాక ఉపఎన్నికలు హాట్‌టాపిక్‌గా మారాయి.కాంగ్రెస్, టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ నెలకొనగా.

టీడీపీతో పాటు మిగతా పార్టీలు కూడా ఇక్కడ పోటీకి దిగాయి.

అధికార టీఆర్‌ఎస్ పార్టీ గెలుపుపై ధీమాగా ఉండగా.

బీజేపీ, కాంగ్రెస్ కూడా తామే గెలుస్తామని చెబుతున్నారు.కానీ ఉపఎన్నికలలో అధికార పార్టీకి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయం తెలిసిందే.

అయితే దుబ్బాక ఉపఎన్నికలు హోరాహోరీగా జరుగుతుండటంతో ఏ పార్టీకి విజయం సాధిస్తుందనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది.

అయితే ప్రస్తుతం దుబ్బక ఉపఎన్నికలు జరుగుతుండటం, త్వరలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరగనున్న క్రమంలో తెలంగాణలో బలపడాలని ప్రయత్నాలు చేస్తున్న బీజేపీకి షాక్ తగిలింది.

బీజేపీ అధికార ప్రతినిధి రావుల శ్రీధర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.తన రాజీనామా లేఖను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఆయన పంపారు.

పార్టీపైన అసంతృప్తితో తాను రాజీనామా చేసినట్లు శ్రీధర్ రెడ్డి తెలిపారు.

ఆదివారమే తాను టీఆర్‌ఎస్‌లో చేరుతున్నానని శ్రీధర్ రెడ్డి చెప్పారు.తెలంగాణ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ బాగా కృషి చేస్తున్నారని, ఆయన చేసిన కార్యక్రమాలు నచ్చే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు తెలిపారు.11 ఏళ్ల క్రిందట బీజేపీలో తాను చేరానని, 2018లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశానన్నారు.ఇటీవల తెలంగాణ విషయంలో బీజేపీ అనుసరిస్తున్న విధానాలు తనకు నచ్చలేదని, అందుకే ఆ పార్టీని వీడానని చెప్పుకొచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube