ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక్క స్టార్ హీరోతో సినిమా నిర్మించడం అంటే మామూలు విషయం కాదు.ఎంతగానో ప్రయత్నాలు చేస్తే ఒక స్టార్ హీరో డేట్స్ కుదరడం కష్టం.
అలాంటిది నిర్మాత దానయ్య వరుసగా మహేష్బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్లతో సినిమాలు చేస్తూ ఈమద్య కాలంలో టాప్ నిర్మాతగా దూసుకు పోతున్నాడు.దానయ్య ఈ మద్య నిర్మిస్తున్న ప్రతి సినిమా కూడా రికార్డులు బ్రేక్ చేస్తున్నాయి.
ఈయన నిర్మించిన ‘భరత్ అనే నేను’ చిత్రం టాలీవుడ్ టాప్ 3 చిత్రంగా నిలిచిన విషయం తెల్సిందే.రెండు వారాల్లో రెండు వందల కోట్ల కలెక్షన్స్ సాధించి దానయ్యకు దాదాపు 100 కోట్ల లాభాలను తెచ్చి పెట్టిందనే టాక్ వినిపిస్తుంది.
భరత్ అనే నేను చిత్రం విడుదల అయ్యిందో లేదో అప్పుడే మరో స్టార్తో సినిమాను మొదలు పెట్టాడు.రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్కు దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే.నిర్మాత దానయ్య ఈ చిత్రాన్ని దాదాపు 65 కోట్లతో తెరకెక్కిస్తున్నాడు.అయితే రామ్ చరణ్కు ఉన్న క్రేజ్ నేపథ్యంలో, బోయపాటిపై ఉన్న నమ్మకంతో అన్ని ఏరియాల్లో ఈ చిత్రం ఖచ్చితంగా 150 కోట్ల బిజినెస్ను చేయడం ఖాయం అంటున్నారు.
అంటే ఈ చిత్రంతో కూడా దానయ్యకు భారీగా లాభాలు దక్కడం ఖాయం అంటూ ఇప్పటికే నిర్థారణ అయ్యింది.
ఇక తెలుగు సినిమా ప్రజానికం అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న జక్కన్న మల్టీస్టారర్ చిత్రాన్ని కూడా దానయ్య నిర్మిస్తున్న విషయం తెల్సిందే.
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్లు హీరోుగా నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రంను దానయ్య దాదాపు 250 కోట్లతో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు, ఒక తెలుగు సినిమాను 100 కోట్లు పెట్టి నిర్మించడం అంటేనే సాహసం.అయితే రాజమౌళి దర్శకత్వంలో సినిమా అంటే ఆ సినిమాకు వెయ్యి కోట్లు పెట్టినా పర్వాలేదు.
అందుకే దానయ్య ఏకంగా 250 కోట్లను పెట్టేందుకు ముందుకు వచ్చాడు.
ఇలా వరుసగా భారీ చిత్రాలను నిర్మిస్తు, వరుసగా భారీ విజయాలను అందుకుంటున్న దానయ్య ప్రస్తుతం టాలీవుడ్ టాప్ నిర్మాతగా వెలుగు వెలుగుతున్నాడు.
ఒక్కస్టార్ హీరో డేట్లు దొరకడం కష్టంగా ఉన్న ఈ సమయంలో ఇలా వరుసగా దానయ్యకు డేట్లు ఎలా దొరుకుతున్నాయా అని ఇతర నిర్మాతలు జట్టు పీక్కుంటున్నారు.ఈ సంవత్సరంలో దానయ్య ఇంకా ఎన్ని సినిమాలను మొదలు పెడతాడో, ఇంకా ఎంత మంది స్టార్స్ డేట్లు ఆయన వద్ద ఉన్నాయో చూడాలి.