దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.లిక్కర్ స్కాం మనీలాండరింగ్ కేసులో నిందితుడుగా ఉన్న వ్యాపార వేత్త అమిత్ అరోరాకు కస్టడీ పొడిగించాలని ఈడీ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఈ పిటిషన్ పై విచారణ చేసిన రౌస్ అవెన్యూ కోర్టు అమిత్ అరోరాకు ఈడీ కస్టడీని పొడిగించింది.ఈ మేరకు మరో వారం రోజులపాటు కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది.
అనంతరం తదుపరి విచారణను ఈనెల 13కు వాయిదా వేసింది.