టాలీవుడ్లో తనదైన నటనతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు నటుడు కమ్ హీరో సత్యదేవ్.ఆయన నటించిన లేటెస్ట్ మూవీ ‘తిమ్మరుసు’ ఇటీవల థియేటర్లలో రిలీజ్ అయ్యి మంచి టాక్ను సొంతం చేసుకుంది.
సత్యదేవ్ నటనతో ఈ సినిమాకు ప్రాణం పోయగా, ఈ సినిమా కథ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది.ఇక ఈ సినిమాను త్వరలోనే డిజిటల్ ప్లాట్ఫాంపై స్ట్రీమింగ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.
ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.అయితే ఈ సినిమాను థియేటర్లలో చూలేకపోయిన ప్రేక్షకుల కోసం ఈ సినిమాను త్వరలోనే డిజిటల్ ప్లాట్ఫాంపై అందుబాటులోకి తీసుకువస్తున్నారు చిత్ర యూనిట్.
తిమ్మరుసు చిత్రాన్ని ఈ నెల 28వ తేదీ నుండి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది.పూర్తిగా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమాలో సత్యదేవ్ లాయర్ పాత్రలో నటించి మెప్పించాడు.
ఇక హీరోయిన్గా ప్రియాంక జావల్కర్ మరోసారి ఆకట్టుకుంది.ఈ సినిమాను దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి తెరకెక్కించాడు.
ఈ సినిమాలో సత్యదేవ్ పర్ఫార్మె్న్స్కు అదిరిపోయే రెస్పాన్స్ లభించిందని చిత్ర యూనిట్ పేర్కొంది.
ఏదేమైనా థియేటర్ల వద్ద మంచి టాక్ వచ్చినా హిట్ కొట్టలేకపోయిన తిమ్మరుసు చిత్రం, డిజిటల్ స్ట్రీమింగ్తో ఎలాంటి రెస్పాన్స్ను దక్కించుకుంటాడా అనేది చూడాలి.
ఇక ప్రస్తుతం సత్యదేవ్ మిల్కీ బ్యూటీ తమన్నాతో జతకట్టి ‘గుర్తుందా శీతాకలం’ అనే సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమాను అతి త్వరలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.
మరి ఈ సినిమాలో సత్యదేవ్ ఎలాంటి పాత్రలో నటిస్తున్నాడా, ఈ సినిమాతో ఎలాంటి రెస్పాన్స్ను దక్కించుకుంటాడా అనేది తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.