ప్రేమమ్ (మలయాళ చిత్రం) మూవీతో మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ యువకుల హృదయాలను గెలుచుకుంది.తెలుగు ప్రేమమ్ లోను సుమ గా ఆకట్టుకుంది.
అంతకంటే ముందే అ.ఆ సినిమాలో సొంతగా డబ్బింగ్ చెప్పుకుని మరీ మెప్పించింది
శతమానం భవతి చిత్రంలో శర్వానంద్ తో జోడీగా నటించి మంచి మార్కులు కొట్టేసింది.ఉన్నదీ ఒక్కటే జిందగీ లోను చక్కగా నటించి మంచి అవకాశాలను అందుకుంది.ప్రస్తుతం “తేజ్ ఐ లవ్ యూ”, ‘”హలో గురు ప్రేమకోసమే” చిత్రాల్లో నటిస్తున్న ఈ బ్యూటీ నటన అంత ఈజీ కాదంటోంది.
రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ అమ్మాయిల కష్టాల గురించి చెప్పింది.‘గతంలో నేనూ అందరిలాంటి అమ్మాయినే.చాలామందిలా వేధింపులు తప్పలేదు’ అంటూ .ఒక్కోసారి మనకు తెలీకుండానే మనల్ని ఎదుటివాళ్లు వేధిస్తుంటారు
టిక్కెట్ ఇచ్చే వంకతో బస్సులో కండక్టర్ అమ్మాయిల్ని తాకొచ్చు.కానీ ఆ రద్దీలో మనం దాన్ని అంతగా పట్టించుకోం.అంతేకాదు అమ్మాయిలను తప్పుడు ఉద్దేశంతో చూడటం కూడా వేధింపుల్లోఒక భాగమే
ఎవరు ఏ ఉద్దేశంతో తమను చూస్తున్నారో అర్థం చేసుకోవడం అమ్మాయిలకు పెద్ద కష్టమేం కాదు.
అలా ప్రవర్తించేవాళ్లంతా తమకూ ఇంట్లో అమ్మలూ, అక్కాచెల్లెళ్లూ ఉంటారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.
తాజా వార్తలు