చంద్రబాబుకి డ్రగ్స్ టెస్ట్ చేయాలంటున్న వైసీపీ నేత..!!

వైసీపీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులుచంద్రబాబు డ్రగ్స్ తీసుకుంటున్నారనే అనుమానం తనకుందని.ఆయనకి నార్కో టెస్టు చేయాలి అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

 Ycp Leader Wants To Test Drugs For Chandrababu Chandrababu, Korremula Srinivasul-TeluguStop.com

చంద్రబాబు ఢిల్లీ పర్యటన పై మాట్లాడిన ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు… ఢిల్లీలో ఆయన వ్యవహరించిన తీరుపై సీరియస్ అయ్యారు.బద్వేలు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కొరముట్ల శ్రీనివాసులు.

మాట్లాడుతూ.బద్వేల్ లో జరుగుతున్న ఉపఎన్నిక … పార్టీల మధ్య కాకుండా నీతికి అవినీతికి, న్యాయానికి అన్యాయానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు అని స్పష్టం చేశారు.

Telugu Ap, Chandrababu, Jagan, Ysrcp-Political

దివంగత డాక్టర్ వెంకట సుబ్బయ్య అకాల మరణం కారణంగా… అదే ఇంట్లో ఆయన భార్య సోదమ్మ పేరును పార్టీ అధినేత జగన్ ఖరారు చేయడం జరిగిందని పేర్కొన్నారు.ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయకపోయినా గాని వేరే పార్టీలను ఎన్నికలలో ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపించారు.ఇక ఇదే తరుణంలో పోటీలో నిలిచిన.జాతీయ పార్టీలపై కోరుముట్ల శ్రీనివాసులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.కాంగ్రెస్.రాష్ట్రాన్ని విభజించి మోసం చేస్తే బిజెపి… స్పెషల్ స్టేటస్ విషయంలో మోసం చేయడం జరిగింది అని ధ్వజమెత్తారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్.ప్రజలకు సుభిక్ష పాలన అందిస్తున్నారని స్పష్టం చేశారు.

ప్రజలకు ఉపయోగపడే పథకాలు అమలు చేస్తూ సచివాలయం అదేవిధంగా వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకే పథకాలు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో బద్వేలు ప్రజలు డాక్టర్ సుధమ్మా నీ… గెలిపించాలని కోరారు.

ఇక ఇదే తరుణంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటన పై కొరుముట్ల శ్రీనివాసులు.తనదైన శైలిలో రెచ్చిపోయారు.

కేవలం అధికార దాహం తోనే చంద్రబాబు ఢిల్లీ పర్యటన చేపట్టారని స్పష్టం చేశారు.రాష్ట్రంలో ఏదో జరుగుతుందని రాష్ట్రపతికి ఫిర్యాదు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని చంద్రబాబు… ఢిల్లీ పర్యటనలో రాష్ట్రపతిని కోరడం పట్ల కోరుముట్ల శ్రీనివాసులు సెటైర్లు వేశారు.40 ఏళ్ల.ఇండస్ట్రీ అంటారు.14 సంవత్సరాల ముఖ్యమంత్రి అనుభవం ఉంది అని చెప్పుకునే చంద్రబాబు ఈ విధంగా… వ్యవహరించటం బాధాకరమని ఆయనకు ఏమైనా మెదడు ఉందా.? లేకపోతే చిన్న మెదడు చితికిందా.? అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.2014వ సంవత్సరంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత తన క్యాబినెట్ సమావేశంలో…మంత్రి గంటా శ్రీనివాసరావు తో… రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు గురించి చంద్రబాబు చర్చించడం జరిగింది అని అప్పటి విషయాలు బయట పెట్టారు.అప్పుడు మాదకద్రవ్యాలు ఏజెన్సీ ప్రాంతం ద్వారా… సరఫరా కావడం పట్ల క్యాబినెట్లో గొప్పగా చెప్పిన చంద్రబాబు… ఇప్పుడు ఢిల్లీ పర్యటనలో జగన్ ప్రభుత్వం పై ఆరోపణలు చేయటం దారుణమని అన్నారు.రాష్ట్రంలో డ్రగ్స్.

లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే… ఢిల్లీలో చంద్రబాబు విష ప్రచారం చేయటం మొత్తం ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.ప్రజలకు జగన్ ప్రభుత్వం మంచి చేస్తుంటే.

చంద్రబాబు ఓర్వా లేక పోతున్నారని పేర్కొన్నారు.ముఖ్యమంత్రి ని దారుణంగా బూతులు తిట్టిన పట్టాభి కి.మద్దతు తెలుపుతూ చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు మొత్తం చూస్తుంటే ఆయన ఏమైనా డ్రగ్స్ తీసుకుంటున్నారేమో అన్న అనుమానం.తనకి ఉందని.

వెంటనే ఆయనకి నార్కో టెస్ట్ చేయాలి.అంటూ.

వైసీపీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు.అనుమానం వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube