చంద్రబాబు కి మొగుడి కోసం జ‌గ‌న్ వ‌ల‌..!

ప్ర‌స్తుతం ఎన్నిక‌ల వేడి రాజుకుంది.వ్య‌క్తుల‌తో సంబంధం లేదు.

 Purandeswari To Join Ysrcp-TeluguStop.com

పార్టీల గెలుపే పార్టీ సార‌ధుల‌కు ప్ర‌ధానం.ఈ క్ర‌మంలో ఎవరు ఎటు వైపు నుంచి వ‌చ్చి పార్టీలో చేరినా.

త‌మ‌కు అనుకూలంగా ఉంటే చాలు! త‌మ‌కు మైలేజీ పెరిగితే ప‌దివేలు! ఇప్పుడు ఈ సూత్రంమీదే ఏపీ రాజ‌కీయాలు సాగుతున్నాయి.నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఈ సూత్రాన్ని పుణికి పుచ్చుకున్న సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు.

వైసీపీ ఎమ్మెల్యేలను త‌న పార్టీలోకి చేర్చుకుని అంద‌రినీ నివ్వెర ప‌రిచారు.జ‌గన్‌ను బ‌ల‌హీనుడిని చేయ‌డం, వైసీపీ హ‌వాను త‌గ్గించ‌డ‌మే అజెండాతో ఆయ‌న‌.

చంద్ర‌బాబు త‌ల న‌రికినా త‌ప్పులేదు- అని వ్యాఖ్యానించిన పాడేరు వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వ‌రిని సైతం ఆనందంగా పార్టీలో చేర్చుకున్నారు.

మ‌రి సీనియ‌ర్‌గా రాజ‌కీయాల‌ను శాసిస్తున్నాన‌ని చెబుతున్న చంద్ర‌బాబే ఇలా చేస్తే.జ‌గ‌న్ ఇంకెంత చేయాలి? ఇప్పుడు ఆ దిశ‌గానే జ‌గ‌న్ కూడా అడుగులు వేస్తున్నాడ‌ని స‌మాచారం.వైసీపీలో ఇప్పుడున్న నాయ‌కులు చంద్ర‌బాబుకు స‌రైన కౌంట‌ర్ ఇవ్వ‌లేక‌పోతున్నార‌ని జ‌గ‌న్ చాలా రోజులుగా ఫీల‌వుతున్నాడు.

అంత‌ర్గ‌తంగా బాబును టార్గెట్ చేసేలా ఆయ‌న ఎన్ని విధాల సూచ‌న‌లు చేసినా.ఎవ‌రూ పెద్ద‌గా పోరు చేయ‌లేక పోతున్నారు.కేవ‌లం విజ‌య‌సాయి రెడ్డి, రోజా వంటి వారు మాత్ర‌మే బాబుకు స‌రైన కౌంట‌ర్ ఇస్తున్నారు.అయినా కూడా అంత ఎఫెక్ట్ క‌నిపించ‌డం లేదు.

అందుకే జ‌గ‌న్ త‌న ప్ర‌య‌త్నాలను ఉధ్రుతం చేస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే ఆయ‌న బీజేపీ నేత‌గా ఉన్న బాబు బంధువు, భార్య సోద‌రి అయిన ద‌గ్గుబాటి పురంద‌రేశ్వ‌రికి జ‌గ‌న్ వ‌ల విసురుతున్నార‌ని అంటున్నారు.

చిన్నమ్మగా సుపరిచితురాలైన దగ్గుబాటి పురంధేశ్వరి కూగా కొన్నాళ్లుగా జగన్ పార్టీలోకి వచ్చేందుకు ప్రయత్నాలు షురూ చేసినట్లుగా స‌మాచారం.బీజేపీలో పరిస్థితులు బాగోలేకపోవటంతో ఆమె పార్టీ మార్పుపై ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు కొన్నాళ్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి.

ముఖ్యంగా ప్రత్యేక హోదా అంశంలో ఆంధ్రా ప్రాంతంలో బీజేపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్న వేళ.ఆ పార్టీలో కొనసాగినా ఎలాంటి ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌ని పురంద‌రేశ్వ‌రి భావిస్తున్నారు.ఇప్ప‌టికే గ‌త ఎన్నిక‌ల్లో ఓట‌మి కూడా ఆమెను భ‌య‌పెడుతోంది.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీ ప‌క్షాన పోటీ చేసినా.

ఓడిపోతే.ప‌రిస్థితి దారుణంగా ఉంటుంద‌ని భావిస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలని చిన్నమ్మ డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది.ఇప్పటికే వైఎస్ జగన్ తో సంప్రదింపుల కార్యక్రమం పూర్తి అయినట్లుగా చెబుతున్నారు.

పార్టీలో చేరేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్న చిన్నమ్మను ఓకే చెప్పాలని జగన్ కూడా భావిస్తున్నట్లు స‌మాచారం.ఎన్టీఆర్ కుమార్తెగా ఆమెకున్న ఛరిష్మాతో పాటు.

ఆమె సామాజిక వర్గానికి చెందిన పలువురు తమ పార్టీకి ఆకర్షితులయ్యే అవకాశం ఉందని జ‌గ‌న్ భావిస్తున్నాడు.

అదే స‌మ‌యంలో బాబుకు దగ్గరి బంధువైన పురంధేశ్వరి పార్టీలో ఉంటే.

బాబుపై విమర్శలు గుప్పించేందుకు.ఆరోపణలకు వచ్చే బలం పార్టీకి మరింత మేలు చేస్తుందన్న ఆలోచనలో జగన్ ఉన్నట్లు చెబుతున్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీలో బాబు ను బ‌లంగా ఎదుర్కొనే నేత‌లు లేర‌న్న లోటు కూడా చిన్న‌మ్మ ద్వారా తీరిపోతుంద‌ని జ‌గ‌న్ భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది.ఇక‌, అన్నీ అనుకున్నట్లు జరిగితే అతి త్వరలోనే చిన్నమ్మ తప్పనిసరిగా జగన్ పార్టీలో చేరటం ఖాయమంటున్నారు.

ఈ ప‌రిణామంతోబాబుకు వైసీపీలో మొగుడు ల‌భించిన‌ట్టేనంటున్నారు ప‌రిశీల‌కులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube