ఏపీలోని కోనసీమ జిల్లాలో తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ బీఆర్ఎస్ కు మద్ధతు లభిస్తుంది.జిల్లాలోని అమలాపురంలో జై కేసీఆర్, జై బోలో కేసీఆర్ అనే నినాదాలతో ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి.
అమలాపురం గడియార స్తంభం వద్ద బ్యానర్లు వెలవడం చర్చనీయాంశంగా మారింది.ఈ క్రమంలో అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి రేవు అమ్మాజీరావు పేరుతో ఈ బ్యానర్లు కనిపిస్తున్నాయి.