కేసీఆర్ కుటుంబంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.కేసీఆర్ కుటుంబంలా తాము దోపిడీ చేయమని తెలిపారు.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ కుటుంబానికి చర్లపల్లి జైలులో డబుల్ బెడ్ రూమ్ కట్టిస్తామన్నారు.అందులో కొడుకు, కోడలు, బిడ్డ అల్లుడు ఉండవచ్చని విమర్శించారు.
అదేవిధంగా కాంగ్రెస్ అభివృద్ధిపై కేటీఆర్ తో చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.ఈ నేపథ్యంలో చర్చకు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని తెలిపారు.