కన్న కూతురుపై అత్యాచారం చేసిన ఓ రాక్షస తండ్రికి కోర్టు జీవిత ఖైదు విధించింది.వాయి వరసలు మరిచిపోయి ఏకంగా కన్నా కూతిరిపైనే అత్యాచారం చేసిన ఆ దుర్మార్గపు తండ్రికి కోర్టు విధించిన శిక్షతో అతడి భార్య కోర్టుకి కృతజ్ఞతలు తెలిపింది.
ఈ ఘటన ఎక్కడో జరగలేదు హైదరాబాద్ లోనే జరిగింది.ఈ ఘటన జరిగిన రెడేళ్ళ తరువాత కోర్టు సంచలన తీర్పు ప్రకటించింది.
వివరాలలోకి వెళ్తే….
తాడ్బన్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి 46 ఎలక్ర్టీషియన్గా పనిచేస్తున్నాడు…ప్రతీ రోజు మద్యం తాగి ఇంటికి వచ్చి భార్యా కూతురిని హింసించే వాడు వారిని నిత్యం కొడుతూ ఉండేవాడు.అయితే ఈ భాధలు భరించలేని ఆమె మూడేళ్ల క్రితం విడాకులు తీసుకుంది.ఈ మధ్యలో ఆమె తన 12అ ఏళ్ల కూతురుతో వేరేగా ఉంటోంది.
అయితే ఈ క్రమంలో ఆమె భర్త ఒక రోజు అంటే 2016 సెప్టెంబర్ 24వ తేదీ అర్ధరాత్రి మద్యం మత్తులో ఆమె వద్దకు వెళ్లి గొడవపడి గదిలో బంధించి కూతురిపై అత్యాచారం చేశాడు.
ఈ ఘటనతో తీవ్రంగా కలత చెందినా ఆమె తన కూతురికి జరిగిన అన్యాయంపై మరుసటి రోజు పోలీసులకి ఫిర్యాదు చేసింది.
దాంతో నిందితుడిని అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు.కేసు పూర్వాపరాలను పరిశీలించిన నాంపల్లి కోర్టు న్యాయమూర్తి సునీత నిందితుడికి జీవిత ఖైదు విధించారు…దాంతోపాటు 2 వేల రూపాయలు జరిమానా విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.