ఏపీ ప్రభుత్వంపై బీజేపీ నేత సత్యకుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.రాష్ట్రంలో ఎమర్జెన్సీ తలపించేలా జీవో నెంబర్.1 ఉందన్నారు.ప్రతిపక్షాలను ఎదుర్కొనేందుకు కావాలనే కుట్రపూరితంగా జీవో ప్రవేశపెట్టిందని ఆరోపించారు.
వైసీపీ నాయకులు ఆంక్షలు పాటిస్తున్నారా అని ప్రశ్నించారు.వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని విమర్శించారు.
అదేవిధంగా ఏపీలో జనసేనతో బీజేపీ పొత్తు కొనసాగుతుందని సత్యకుమార్ స్పష్టం చేశారు.