ఏపీలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్నికల ప్రధాన అధికారిని కలిశారు.గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు వాలంటీర్లను ఉపయోగిస్తున్నారని ఫిర్యాదు చేశారు.
ఈసీ ఆదేశాలను అధికారులు పట్టించుకోవడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.దీనిపై సాక్ష్యాలతో సహా ఫిర్యాదు చేశామని టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబు తెలిపారు.
ఈసీ చర్యలు తీసుకోకపోతే ఢిల్లీలో ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు.వాలంటీర్ల దగ్గర గ్రాడ్యుయేట్ ల డేటా ఉందని ఎమ్మెల్సీ అశోక్ బాబు పేర్కొన్నారు.