పవన్ కళ్యాణ్ తన పర్యటనలలో చంద్రబాబే టార్గెట్ గా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.శ్రీకాకుళం పర్యటనలో భాగంగా చంద్రబాబు పై పవన్ చేస్తున్న కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి.
ఎన్నడూ లేని విధంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు ని టార్గెట్ చేశారు.చంద్రబాబు ఏపీ ప్రయోజనం కోసం చేసినది ఏమి లేదని.అసలు చంద్రబాబు సహకరించి ఉంటే రాష్ట్రానికి ఎప్పుడో ప్రత్యెక హోదా వచ్చేదని అయితే బాబు కేంద్రం తో కుమ్మక్కు అయ్యి ఏపీ ప్రయోజనాలని తాకట్టు పెట్టారు అంటూ ధ్వజమెత్తారు
చంద్రబాబు చేస్తున్న ధర్మ దీక్షల్లో ధర్మం ఎక్కడా కనపడటం లేదని ఎద్దేవా చేశారు.హోదా కోసం తాను చేస్తున్న కవాతులు, పోరాటం ఢిల్లీ పెద్దలు గమనిస్తారని తప్పకుండా మనకి న్యాయం జరుగుతుందని అన్నారు.శ్రీకాకుళం జిల్లా పోరాటయాత్రలో భాగంగా పవన్ సోమవారం పాలకొండ, రాజాం, రణస్థలం ప్రాంతాల్లో పర్యటించారు…ఈ సందర్భంలో తానూ చేస్తున్న ప్రసంగాలు ప్రజలకి తెలియకుండా కరెంటు తీస్తున్నారు.జనసైనికులపై దాడులు చేయించి జైళ్లలో పెడుతున్నారు…ఈ ఒక్క విషయం చాలు జనసేన బలం ఎలా ఉందొ తెలుసుకోవచ్చు అన్నారు పవన్ కళ్యాణ్
ఒక్క శ్రీకాకుళం జిల్లా పొగిరి ప్రాంతంలోనే 15 మందిని జైల్లో పెట్టారని ఆరోపించారు…అయితే ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.
వెన్నుపోటు పొడవడానికి ఇదేం ఎన్టీఆర్ నాటి తరం కాదని, తాము.మమ్మల్ని రెచ్చగొట్టద్దు రెచ్చగొడితే.తిరిగి దాడి చేయగలమని హెచ్చరించారు.సోమవారం ఎన్టీఆర్ జయంతి అని గుర్తుచేసిన పవన్.
అసలు ఎన్టీఆర్కు చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు.కేవలం ఆయన ఫొటోను ప్రచారానికి వాడుకుంటున్నారని విమర్శించారు
అంతేకాదు 2019లో టీడీపీ రాష్ట్రంలో తుడుచుపెట్టుకుపోవడం ఖాయమని జోస్యం చెప్పారు…ఇదే సందర్భంగా అక్కడే ఉన్న అశోక్ గజపతి రాజు ఫ్లెక్సీ చూపిస్తూ.“2014” ఎన్నికలప్పుడు ఆయన కోసం నేను విజయనగరం వెళ్లి ప్రచారం చేశాను…కానీ ఇప్పుడు మాత్రం ప్రత్యెక హోదా పేరు ఎత్తిన నేను ఎవరు అతడు అంటున్నారు నేను ఆయన పెద్దరికాన్ని గౌరవిస్తున్నారు అది నిలబెట్టుకోవడం ఉత్తమమని అన్నారు.విజనగరం అభివృద్ధి ఎలా ఉందొ ఇప్పుడు చూస్తూనే ఉన్నాం కదా అంటూ ఫైర్ అయ్యారు.
ఒక సంస్థ చేసిన సర్వే ప్రకారం రాష్ట్రం అవినీతిలో రెండవ స్థానం లో ఉంది ఇదేనా చంద్రబాబు చేసిన అభివృద్ధి అంటూ ప్రశ్నించారు.