ఎట్టకేలకు రాజశేఖర్‌కు దొరికేశాడు

యాంగ్రీయంగ్‌ మన్‌గా తెలుగు సినిమా పరిశ్రమలో మరియు ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్న హీరో రాజశేఖర్‌.ఈయన కొన్ని సంవత్సరాల ముందు వరకు స్టార్‌ హీరోలతో పోటీగా చిత్రాలు చేస్తూ వారికి ఏమాత్రం తీసిపోకుండా సక్సెస్‌లను దక్కించుకున్నాడు.

 Rajasekhar In Prashanth Varma Direction-TeluguStop.com

ఈయన చేసిన ఎన్నో చిత్రాలు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి.యాక్షన్‌ సినిమాలు మాస్‌ను ఉర్రూతలూగించాయి.

అయితే ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది.దాదాపు పది సంవత్సరాలుగా రాజశేఖర్‌ నటించిన చిత్రాల్లో ఒక్క గరుడవేగ చిత్రం మినహా ఏ ఒక్కటి సక్సెస్‌ కాలేదు.

ఈమద్య గరుడవేగ సక్సెస్‌ దక్కడంతో రాజశేఖర్‌ ఇంకా కొన్నాళ్ల పాటు హీరోగా నటించాలని భావిస్తున్నాడు.

గరుడవేగ చిత్రం కూడా ఫలితం తారుమారు అయ్యి ఉంటే ఖచ్చితంగా రాజశేఖర్‌ ఇప్పటికే విన్‌ లేదా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా రెండు మూడు సినిమాలకు కమిట్‌ అయ్యేవాడు.కాని గరుడవేగ చిత్రంతో ఆయనలో హీరో ఇంకా బతికే ఉన్నాడు.కొన ఊపిరితో కొట్టుకుంటున్న ఆయనలోని హీరోకు గరుడవేగ ప్రాణం పోసినట్లయ్యింది.

ఆ చిత్రం తర్వాత రాజశేఖర్‌ ఇక వరుసగా హీరోగా చిత్రాలు చేయాలని భావించాడు.అయితే ఈయనతో సినిమాలు చేసేందుకు దర్శకులు ముందుకు రావడం లేదు.

వచ్చిన ఇద్దరు ముగ్గురు దర్శకుల కథలు రాజశేఖర్‌కు నచ్చలేదు.

ఎక్కువ శాతం కొత్త వారు మాత్రమే రాజశేఖర్‌తో సినిమాను చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

కాని రాజశేఖర్‌ మాత్రం స్టార్‌ దర్శకులతో సినిమాలు చేయాలని భావిస్తున్నాడు.ఇక లాభం లేదని ‘అ’ చిత్రంతో విభిన్న చిత్ర దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ప్రశాంత్‌ వర్మకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు.

ప్రస్తుతం ఈయన బాలీవుడ్‌ ‘క్వీన్‌’ చిత్రంను తెలుగులో ‘దటీజ్‌ మహాలక్ష్మి’ టైటిల్‌తో రీమేక్‌ చేస్తున్నాడు.నీకంఠ వదిలేసిన ఈ చిత్రాన్ని ప్రశాంత్‌ వర్మ పూర్తి చేసే పనిలో ఉన్నాడు.

ఇప్పుడు ఆ దర్శకుడితో రాజశేఖర్‌ చిత్రాన్ని చేయబోతున్నట్లుగా అనధికారికంగా, స్వయంగా ప్రకటించాడు.ప్రస్తుతం ప్రశాంత్‌ వర్మ చేస్తున్న దటీజ్‌ మహాలక్ష్మి చిత్రం పూర్తి అయిన వెంటనే రాజశేఖర్‌తో సినిమా మొదలయ్యే అవకాశం ఉంది.

ట్యాలెంటెడ్‌ దర్శకుడు అయిన ప్రశాంత్‌ వర్మ ఇప్పటికే రాజశేఖర్‌ కొసం ఒక విభిన్నమైన స్క్రిప్ట్‌ను రెడీ చేసినట్లుగా తెలుస్తోంది.వయస్సుకు తగ్గ కథతో రాజశేఖర్‌ రావాలని భావిస్తున్నాడు.

ఈ వయస్సులో లవ్‌ స్టోరీలు, కాలేజ్‌ స్టూడెంట్‌ పాత్రలు చేస్తే ప్రేక్షకులు అంగీకరించరు అనే విషయం ఆయనకు కూడా తెల్సిందే.అందుకే వయస్సుకు తగ్గ పాత్రను, అందుకు తగ్గ కథను రాజశేఖర్‌ ఎంపిక చేసుకున్నట్లుగా సమాచారం అందుతుంది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లో రాజశేఖర్‌, ప్రశాంత్‌ వర్మల కాంబో మూవీ పట్టాలెక్కే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube