విజయవాడలో దారుణ ఘటన జరిగింది.ధర్మవరం చీరల వ్యాపారులపై స్థానిక వ్యాపారులు దాడికి పాల్పడ్డారు.
చీరలు అమ్మిన సొమ్ము అడగడానికి వచ్చిన వ్యాపారులను నిర్బంధించి దాడి చేశారని తెలుస్తోంది.బకాయిలపై ధర్మవరం చీరల వ్యాపారులకు, స్థానిక వ్యాపారులకు మధ్య వివాదం తలెత్తింది.
ఈ క్రమంలో వ్యాపారుల బట్టలు తీసి అమానుషంగా దాడి చేశారు.ఈ ఘటన 20 రోజుల క్రితం చోటు చేసుకోగా తాజాగా వెలుగులోకి వచ్చింది.
సమాచారం అందుకున్న ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.