ఏపీలో వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం ఖాయమని మంత్రి రోజా అన్నారు.తప్పుడు ప్రచారాన్ని పరిగణనలోకి తీసుకోనని తెలిపారు.
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ఇంకా సీట్ల సర్దుబాటు చేసుకోలేదని మంత్రి రోజా పేర్కొన్నారు.ఉమ్మడి మ్యానిఫెస్టో తయారు చేసుకోవడానికే వారికి సమయం లేదని విమర్శించారు.
ఈ క్రమంలోనే ఇద్దరు నాయకులు ఎక్కడ పోటీ చేయాలో తేల్చుకోలేకపోతున్నారని మండిపడ్డారు.ఏపీని సీఎం జగన్ ఆరోగ్య ఆంధ్రాగా మార్చారని మంత్రి రోజా వెల్లడించారు.