నియోజకవర్గాల పునర్విభజన లేదని కేంద్రం ఏ రోజైతే స్పష్టంచేసిందో అప్పటి నుంచి తెలుగు తమ్ముళ్ల మధ్య విభేదాలు రచ్చకెక్కుతున్నాయి.పార్టీ బలోపేతానికంటూ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకున్న నియోజకవర్గాల్లోని అసంతృప్తి సెగలు సీఎం చంద్రబాబుకు తగులుతున్నాయి.
సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్ల కంటే తక్కువ సమయమే ఉండటంతో.ఆయా నియోజకవర్గాల్లో టికెట్ల కోసం పోటీ మొదలైంది.
ఇప్పటికే నెల్లూరు, కడప, వంటి జిల్లాల్లో ఇటువంటి సమస్యలు ఉత్పన్నమవుతుంటే.కొత్తగా మరో తలనొప్పి చంద్రబాబు స్టార్ట్ అయింది.
నంద్యాలలో గంగుల ప్రతాప రెడ్డి చేరిక.కొన్ని సమస్యలకు చెక్ పెట్టగా.
మరికొన్నింటికి ఆజ్యం పోసింది.
నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో మాజీ ఎంపీ గంగుల ప్రతాప్రెడ్డి ఊహించని విధంగా టీడీపీలో చేరడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.
భూమాకు ప్రత్యర్థులుగా నిలిచిన గంగుల కుటుంబీకుల్లో ప్రభాకర్రెడ్డి ఒకరు.ఫ్యాక్షన్ రాజకీయాల పుట్టినిల్లుగా పేరుగాంచిన ఆళ్ళగడ్డలో భూమా, గంగుల కుటుంబాల మధ్యే ఘర్షణలు నడిచాయి.
రాజకీయ పరిణామాల నేపథ్యంలో భూమా నాగిరెడ్డి, ఆయన కూతురు అఖిలప్రియ టీడీపీలో చేరారు.
భూమా అఖిలప్రియకు, గంగుల ప్రతాపరెడ్డికి మధ్య సఖ్యత చేకూరే అవకాశాలు కనిపించడం లేదు.
రాజకీయాల్లో యువకులైన అఖిలప్రియ ఎలా నెగ్గుకొస్తుందనేది ఆసక్తికరమే.ఇక టికెట్ విషయంలోనూ వీరి మధ్య ఆసక్తికర పోటీ నెలకొనే అవకాశాలు లేకపోలేదు.
ఇక కడపలోనూ ఇదే సీన్ రిపీట్ అవుతోంది.జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిని పార్టీలోకి తీసుకున్నప్పుడే అక్కడ ఇన్ఛార్జిగా ఉన్న రామసుబ్బారెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
పార్టీ అవసరాలు, వైకాపాను బలహీనపర్చ డంలో భాగంగా ఆయన్ను పార్టీలో చేర్చుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు నచ్చచెప్పారు.అయితే ఆదికి మంత్రి పదవి ఇచ్చిన నేపథ్యంలో మధ్యేమార్గంగా ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చిసంతృప్తి పరిచారు.
ఇప్పుడు తన వారసుడిని రంగంలోకి తీసుకురావడానికి ఆది చేస్తున్న ప్రయత్నాలను రామసుబ్బారెడ్డి అడ్డుకుంటున్నారు.ఇక రాబోయే ఎన్నికల్లో తమకు టిక్కెట్ ఇవ్వకుంటే తాము కూడా పార్టీని వదిలేస్తామని రామ సుబ్బారెడ్డి హెచ్చరిస్తున్నారు.
ఇద్దరూ పట్టువిడవడం లేదు.