మనం బాగుపడకపోయినా పర్లేదు కానీ పక్కవాడు మాత్రం బాగుపడకూడదు అనే భావన చాలామందిలో కనిపిస్తుంటుంది.అలాగే… రాజకీయాల్లో కూడా మన పార్టీ సంగతి ఎలా ఉన్నా పక్క పార్టీ పాడవుతుందా లేదా అని చూస్తూ ఉంటారు.ఇది సహజం.కేంద్రంలో అధికారం లో ఉన్న బీజేపీ – ఏపీ అధికార పార్టీ టీడీపీ ఈ విధంగానే వ్యవహరిస్తున్నాయి. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదని చంద్రబాబు అవకాశం దొరికినప్పుడల్లా చెప్తూనే ఉన్నాడు.అదేవిధంగా బీజేపీ కుడా చంద్రబాబు ప్రభుత్వం మళ్ళీ గెలిచే పరిస్థితి లేదని చెప్పుకుంటున్నారు.
బీజేపీ పార్టీ కార్యవర్గ సమావేశంలో ఇదే అంశం చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది.చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలవలేడు అని, ఇది తథ్యమని ఆ పార్టీ నేతలు ఆ సమావేశంలో చర్చిన్చుకున్నారట.గత ఎన్నికల్లో చంద్రబాబుకి మద్దతుగా నిలిచిన ప్రధాన సామాజికవర్గాలు ఇప్పుడు దూరం అయ్యాయని.కాబట్టి టీడీపీ మళ్ళీ అధికారం చేపట్టే ఛాన్స్ లేదని బీజేపీ భావిస్తోంది.
చంద్రబాబు అన్ని వర్గాలూ ఆయనకు దూరం అయ్యాయని బీజేపీ నేతలు అంటున్నారు.గత ఎన్నికల్లో కూడా 5లక్షల ఓట్ల మెజారిటీతో ఒడ్డున పడ్డాడని.
అప్పుడు దేశమంతా మోడీ వెంట ఉండడం, పవన్ కల్యాణ్ వల్ల కాపులు టీడీపీకి ఓట్లు వేయడం, అనుభవజ్ఞుడు కాబట్టి కొత్త రాజధానిని బాగా అభివృద్ధి చేస్తాడని భావించడం, రైతు రుణమాఫీ మొదలైన కారణాల వల్ల చాలామంది టీడీపీకి ఓట్లు వేశారు.అయినా ఆయన గెలిచింది ఒక్కశాతం మెజారిటీతో అని బీజేపీ లెక్కలు చెప్తోంది.
ఇప్పుడు ప్రజలకు ఆ భ్రమలన్నీ పోయాయి.రుణమాఫీ చేయలేదు.
కాబట్టి రైతులు చంద్రబాబుపై మండిపడుతున్నారు.కాగితాలమీద తప్ప రాజధాని ఎక్కడా కనిపించడం లేదు.
కాపులు టీడీపీకి దూరమయ్యారు, ప్రభుత్వ అవినీతి బాగా పెరిగినట్టు సర్వేలు కుడా చెప్తున్నాయని బీజేపీ వాదిస్తోంది.
బీజేపీ మళ్లీ గెలవదు అని చంద్రబాబు ప్రచారం చేస్తున్నాడు.
ప్రజల ధనం కోట్ల రూపాయలు వెచ్చించి నిర్వహిస్తున్న దీక్షల్లో చంద్రబాబు ఇదే మాట చెబుతున్నాడు.బీజేపీ రేపటి ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమని చెబుతున్నాడు.
బాబు బీజేపీ విషయంలో ఈ అభిప్రాయాన్ని కలిగి ఉండగా బాబు విషయంలో బీజేపీ కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది.అసలు సమరం ఇంకా ముందు ఉంది కదా ఎవరు ఏంటో అప్పుడే తెలిసిపోతుంది.