టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల ‘మహానటి’ చిత్రంలో నటించిన విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ రూపొందిన ఆ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఆ చిత్రంలో ఆమె జీవితాన్ని కళ్లకు కట్టారు.ఈ చిత్రం తనకు చాలా నేర్పిందని, ఆ సినిమా కారణంగా జీవితంలో మంచి నేర్చుకున్నట్లుగా చెప్పుకొచ్చింది సమంత.ఇంకా మహానటి విషయమై పు విషయాలను సమంత చెప్పుకొచ్చింది
కెరీర్ ఆరంభంలో సమంత హీరో సిద్దార్థతో ప్రేమలో పడ్డ విషయం తెల్సిందే.వారిద్దరు వివాహం చేసుకునేందుకు కూడా రెడీ అయ్యారు.ఇద్దరి మద్య దాదాపు సంవత్సరం పాటు ఘాడమైన ప్రేమ సాగింది.అయితే వీరిద్దరు ఏదో కారణం వల్ల విడిపోయారు.సిద్దార్థ్ గురించిన కొన్ని విషయాలు సమంతకు తెలియడం వల్ల ఆయన్ను వదిలేసిందనే టాక్ కూడా వినిపించింది.అయితే ఇప్పటి వరకు ఆయనతో ప్రేమ విషయంలో సమంత ఎప్పుడు కూడా క్లారిటీగా మాట్లాడలేదు.
కాని ఎట్టకేలకు సమంత ఆ విషయమై ఇండైరెక్ట్గా మాట్లాడటం జరిగింది
సావిత్రి జీవితం నాశనం అవ్వడానికి కారణం ఆమె తీసుకున్న పెళ్లి నిర్ణయం అని అంతా అంటున్నారు.ఆ విషయాన్ని సమంత కూడా ఏకీభవించింది.
జెమిని గణేషన్ను వివాహం చేసుకోకుంటే ఆమె పరిస్థితి మరోలా ఉండేది అంటూ సమంత చెప్పుకొచ్చింది.తాను కూడా అలాంటి ప్రమాదంలో చిక్కుకునేదాన్ని అని, ఆ సమయంలో పెళ్లి చేసుకుని ఉంటే సావిత్రి గారి జీవితంలా జీవితం కూడా ఎటూ కాకుండా అయ్యేది అంటూ సమంత తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది
సిద్దార్థను పెళ్లి చేసుకుని ఉంటే తన జీవితాన్ని తానే నాశనం చేసుకున్నదాన్ని, చైతూను వివాహం చేసుకోవడంతో కొత్త జీవితం వచ్చింది.
చైతూను వివాహం చేసుకోవడం నా జీవితంలోనే అతి పెద్ద అదృష్టంగా భావిస్తాను అంటూ సమంత చెప్పుకొచ్చింది.సిద్దార్థ్ కూడా జెమిని గణేషన్ మాదిరిగా మోసం చేసేందుకు ప్రయత్నించాడు అంటూ సమంత ఇండైరెక్ట్గా చెప్పుకొచ్చింది.
సమంత తన పాత లవ్ విషయాన్ని గురించి వ్యాఖ్యలు చేయడం ఇదే ప్రథమం.