వరుసగా మూడు నాలుగు సక్సెస్లు దక్కించుకున్న దర్శకుడు ఒక ఫ్లాప్ సినిమాను తీస్తే ఆయన కెరీర్ పెద్దగా ఎఫెక్ట్ అవ్వదు.కాని ఒక్కటే మంచి సినిమా తీసి, ఆ తర్వాత ఫ్లాప్ సినిమా, మామూలు ఫ్లాప్ కాదు, అట్టర్ ఫ్లాప్ సినిమా తీస్తే అప్పుడు ఆ దర్శకుడి కెరీర్ ఖతం అయినట్లే అనడంలో ఎలాంటి సందేహం లేదు.
అలాంటి దర్శకులతో స్టార్ హీరోలు కాదు కదా, కనీసం యువ హీరోలు, కొత్త హీరోలు కూడా నటించేందుకు భయపడతారు.ఇప్పుడు అలాంటి పరిస్థితి శ్రీకాంత్ అడ్డాలకు ఉంది.
‘కొత్తబంగారు లోకం’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన శ్రీకాంత్ అడ్డాల ఆ తర్వాత మహేష్బాబు, వెంకటేష్లతో ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ అనే మల్టీస్టారర్ను తెరకెక్కించాడు.ఆ సినిమా యావరేజ్గా ఉన్నప్పటికి శ్రీకాంత్ అడ్డాల ప్రయత్నంను అంతా కూడా అభినందించారు.ఇలాంటి మల్టీస్టారర్ చిత్రాలు ఎన్నో సంవత్సరాలుగా రావాలని ప్రేక్షకులు కోరుతున్నారని, మంచి ప్రయత్నం అంటూ శ్రీకాంత్ అడ్డాలపై ప్రశంసల జల్లు కురిపించింది.సీతమ్మ చిత్రాన్ని చక్కగా చేశాడనే ఉద్దేశ్యంతో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘బ్రహ్మోత్సవం’ చేసేందుకు మహేష్బాబు ఓకే చెప్పాడు
‘బ్రహ్మోత్సవం’ సినిమా మహేష్బాబు కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచింది.
ఏమాత్రం ఆకట్టుకోని కథ, కథనంతో ఆ సినిమాను తెరకెక్కించడం జరిగింది.దాంతో శ్రీకాంత్ అడ్డాల కెరీర్కు ఫుల్ స్టాప్ పడ్డట్లే అని అంతా అనుకున్నారు.అయితే ఇటీవల బ్రహ్మోత్సవం గురించి అంతా మర్చి పోతున్నారు.ఇలాంటి సమయంలో అల్లు శిరీష్తో ఈయన ఒక చిత్రాన్ని చేయబోతున్నాడు అని, గీతాఆర్ట్స్ బ్యానర్లో ఆ సినిమా తెరకెక్కబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది
తాజాగా మీడియాలో వస్తున్న వార్తలపై అల్లు శిరీష్ క్లారిటీ ఇచ్చాడు.
తాను శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నటించబోతున్నట్లుగా వస్తున్న వార్తలు నిజం కాదని, అసలు అలాంటి ఆలోచన తనకు లేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు.శ్రీకాంత్తో భవిష్యత్తులో కూడా సినిమా చేయను అంటూ తేల్చి చెప్పాడు.
గీతాఆర్ట్స్ బ్యానర్లో ఆయనకు అడ్వాన్స్ ఇచ్చి ఉండవచ్చు కాని, ఆ సినిమాను మాత్రం నేను చేయడం లేదు అంటూ అల్లు శిరీష్ చెప్పుకొచ్చాడు.ప్రస్తుతం అల్లు శిరీష్ తెలుగుతో పాటు తమిళం మరియు మలయాళ, కన్నడంలో కూడా సత్తా చాటా ప్రయత్నాలు చేస్తున్నాడు.