చనిపోయిన వారి ఫోటోకి పూజ చేస్తున్నారా.? అయితే అలా చేయడం తప్పంట! ఎందుకో తెలుసా?

పూజించడం వెనుక ఒక్కొక్కరికి ఒక్కో కారణం ఉంటుంది.హిందువుల్లో అధిక శాతం మంది నిత్యం తమ తమ ఇష్ట దేవుళ్లను, దేవతలను పూజిస్తారు.

 Dont Do Pooja For Death People Photos-TeluguStop.com

అయితే కేవలం దేవుళ్లు, దేవతలే కాదు, వారితోపాటు చనిపోయిన తమ పూర్వీకుల ఫొటోలను కూడా పూజ గదిలోనో, దేవుళ్ల పక్కనో ఉంచి, వాటికి కూడా నిత్యం నమస్కరించుకుంటూ ఉంటారు.చనిపోయిన వారిని దైవంగా భావించి ఇలా పూజించడంలో తప్పేమీ లేదు.

కానీ దేవుడి దగ్గర, పూజ గదిలో చనిపోయిన వారి ఫొటోలను మాత్రం ఉంచకూడదట.ఎందుకో తెలుసా?

ఇలా చేస్తే దేవుళ్లకు కోపం వస్తుందట.ఇందుకు గల కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.వాస్తు శాస్త్రం ప్రకారం చనిపోయిన వారి ఫొటోలను పూజ గదిలో ఉంచడం సరికాదు.

దీంతో సదరు కుటుంబానికి మంచి జరగదట.ఇండ్లలో ఈశాన్య దిశగా పూజ గదిని, నైరుతి దిశగా చనిపోయిన వారి ఫొటోలను ఉంచాలని వాస్తు సిద్ధాంతం చెబుతోంది.

ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే ఆ ఇంట్లోకి నెగటివ్ శక్తి ప్రసారమవుతుంది.అంతే కాదు ఆ ఇంట్లోని కుటుంబ సభ్యులకు కూడా మానసిక ప్రశాంతత ఉండదు

చనిపోయిన వారి ఫొటోలను దేవుళ్ల పక్కనే ఉంచి పూజ చేయడం హిందూ ధర్మం ప్రకారం పెద్ద తప్పిదమే అవుతుంది.మనిషి ఎల్లప్పుడూ దేవుడితో సమానం కాదని, నియమాలను అతిక్రమించి అలా చేస్తే ఆ కుటంబంలో కష్టాలు ఎదురవుతాయని నమ్మిక.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube