‘రుద్రమదేవి’ చిత్రాన్ని తెరకెక్కించి సక్సెస్ అయిన గుణశేఖర్ తన తర్వాత సినిమాగా ‘ప్రతాప రుద్రుడు’ చిత్రాన్ని తెరకెక్కించబోతున్న విషయం తెల్సిందే.ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లను కూడా గుణశేఖర్ ప్రారంభించాడు.
ప్రస్తుతం గుణశేఖర్ ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడు.అయితే తాజాగా ఈ సినిమాలో ప్రభాస్ను నటింపజేసేందుకు గుణశేఖర్ ప్రయత్నాలు చేస్తున్నాడని, త్వరలోనే ప్రభాస్కు గుణశేఖర్ స్క్రిప్ట్ను వినిపించే అవకాశాలున్నాయనే ప్రచారం గత వారం రోజులుగా జరుగుతోంది.
తాజాగా ఆ వార్తలపై దర్శకుడు గుణశేఖర్ క్లారిటీ ఇచ్చాడు.
తాజాగా గుణశేఖర్ ఈ విషయంపై స్పందిస్తూ.
ప్రస్తుతం ‘ప్రతాపరుద్రుడు’ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది.ఇప్పటి వరకు ఈ సినిమాకు హీరో ఎవరు అనేది తానే నిర్ణయించుకోలేదు అని, స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయిన తర్వాత హీరో గురించి ఆలోచిస్తాను అన్నాడు.
దాంతో కొన్ని రోజులుగా మీడియాలో వస్తున్న ప్రభాస్ వార్తలకు బ్రేక్ పడ్డట్లు అయ్యింది.ఈ సినిమాను ఇదే సంవత్సరం చివర్లో గుణశేఖర్ ప్రారంభిస్తానని అంటున్నాడు.
ప్రస్తుతం కాకతీయుల చరిత్ర గురించి లోతుగా అధ్యయనం చేస్తున్నాడు.ప్రతాపరుద్రుడుగా ఎవరు నటిస్తారా అని తెలుగు ప్రేక్షకులు మరియు సినీ ప్రముఖులు సైతం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.