ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీ పార్టీకి మరో విజయం

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార గులాబీ రెండో విజయం సాధించింది .ఇది కూడా ఏకగ్రీవ విజయమే.

 Second Victory For Trs In Mlc Elections-TeluguStop.com

మొదటి విజయం వరంగల్లులో కొండా సురేఖ భర్త కొండా మురళి సాధించారు.ఇక గులాబీ పార్టీ గెలవాల్సినవి పది సీట్లు మాత్రమే.

గులాబీ పార్టీకి రెండో విజయం ఆదిలాబాదు జిల్లాలో లభించింది.పురాణం సతీష్ ఇక్కడ పోటీకి నిలబడ్డారు.

ఇక్కడ టీడీపీ , స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేసినా తరువాత ఉపసంహరించుకున్నారు.కాంగ్రెస్ పార్టీ పోటీకి దిగలేదు.

దీంతో ఏకగ్రీవంగా గెలిచారు.రెండు విజయాలు అధికార పార్టీలో ఉత్సాహం కలిగిస్తున్నాయి.

అన్ని సీట్లు గెలుస్తామని అంటున్నారు.ఈ ఉత్సాహంతో గ్రేటర్ హైదారాబాదు ఎన్నికల్లో కూడా తీవ్రంగా కృషి చేస్తారేమో.

శాసన మండలిలో అధికార పార్టీకి బలం పెరిగితే ఆ పార్టీలోకి వలసలు మరింతగా పెరుగుతాయేమో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube