స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార గులాబీ రెండో విజయం సాధించింది .ఇది కూడా ఏకగ్రీవ విజయమే.
మొదటి విజయం వరంగల్లులో కొండా సురేఖ భర్త కొండా మురళి సాధించారు.ఇక గులాబీ పార్టీ గెలవాల్సినవి పది సీట్లు మాత్రమే.
గులాబీ పార్టీకి రెండో విజయం ఆదిలాబాదు జిల్లాలో లభించింది.పురాణం సతీష్ ఇక్కడ పోటీకి నిలబడ్డారు.
ఇక్కడ టీడీపీ , స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేసినా తరువాత ఉపసంహరించుకున్నారు.కాంగ్రెస్ పార్టీ పోటీకి దిగలేదు.
దీంతో ఏకగ్రీవంగా గెలిచారు.రెండు విజయాలు అధికార పార్టీలో ఉత్సాహం కలిగిస్తున్నాయి.
అన్ని సీట్లు గెలుస్తామని అంటున్నారు.ఈ ఉత్సాహంతో గ్రేటర్ హైదారాబాదు ఎన్నికల్లో కూడా తీవ్రంగా కృషి చేస్తారేమో.
శాసన మండలిలో అధికార పార్టీకి బలం పెరిగితే ఆ పార్టీలోకి వలసలు మరింతగా పెరుగుతాయేమో.