అల్లు అర్జున్‌ కోసం ‘వీరభిమన్యు’??

‘రుద్రమదేవి’ చిత్రం తర్వాత ‘ప్రతాప రుద్రుడు’ చిత్రాన్ని తెరకెక్కిస్తాను అంటూ ముందు ప్రకటించిన దర్శకుడు గుణశేఖర్‌ తాజాగా తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు.గుణశేఖర్‌ తన తర్వాత చిత్రానికి ‘వీరాభిమన్యు’గా టైటిల్‌ను ఫిక్స్‌ చేసి రిజిస్ట్రర్‌ కూడా చేయించిన విషయం తెల్సిందే.

 Gunasekhar Planning Veerabhimanyu With Allu Arjun..?-TeluguStop.com

ఈ టైటిల్‌ ప్రత్యేకంగా అల్లు అర్జున్‌ కోసం రిజిస్ట్రర్‌ చేయించాడు అంటూ ప్రచారం జరుగుతోంది.ప్రస్తుతం అల్లు అర్జున్‌ నటిస్తున్న ‘సరైనోడు’ చిత్రం పూర్తి అవ్వగానే గుణశేఖర్‌ దర్శకత్వంలో ఈ ‘వీరాభిమన్యు’ చిత్రంలో నటించనున్నాడు అంటూ ప్రచారం జరుగుతోంది.

గుణశేఖర్‌ ‘రుద్రమదేవి’ చిత్రం షూటింగ్‌ సమయంలో చెప్పిన ఈ స్టోరీ లైన్‌కు అల్లు అర్జున్‌ బాగా ఆకర్షితుడు అయ్యాడని, అందుకే ‘ప్రతాప రుద్రుడు’ చిత్రాన్ని పక్కన పెట్టి మరీ ‘వీరాభిమన్యు’ చిత్రాన్ని తెరకెక్కించాలని భావిస్తున్నట్లుగా గుణశేఖర్‌ సన్నిహితులతో చెబుతున్నాడు.దాంతో విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే సంవత్సరం చివర్లో మెగా హీరో అల్లు అర్జున్‌ హీరోగా గుణశేఖర్‌ స్వీయ దర్శకత్వంలో ‘వీరాభిమన్యు’ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు.

ఇందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ను గుణశేఖర్‌ వచ్చే సంవత్సరం ఆరంభంలో ప్రారంభించనున్నాడు.అల్లు అర్జున్‌ అభిమన్యుడిగా ఆకట్టుకుంటాడని మెగా ఫ్యాన్స్‌ ఆశిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube