భారీ బడ్జెట్తో తెరకెక్కిన ‘రుద్రమదేవి’ చిత్రం గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.దాదాపు 75 కోట్లకు పైగా బడ్జెట్తో గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు.
ముందు నుండి కూడా గుణశేఖర్ పెట్టుబడిని చూసి అంతా షాక్ అవుతూనే ఉన్నారు.అయితే సినిమా విడుదల సమయంలో మంచి క్రేజ్ రావడంతో దాదాపుగా 50 కోట్ల బిజినెస్ చేసింది.
ఆడియో, ఆన్లైన్, శాటిలైట్ రైట్స్ ద్వారా మరో 10 కోట్లు గుణశేఖర్ ఖాతాలో పడ్డాయి.దాంతో మొత్తంగా 60 కోట్లను గుణశేఖర్ తన ఖాతాలో వేసుకోగలిగాడు.
గుణశేఖర్ నష్టం ముందు నుండే ఊహించారు.కాని ఈ చిత్రాన్ని కొనుగోలు చేసిన బయ్యర్లు భారీ నష్టాలు చవి చూడాల్సి వస్తోంది.
తెలుగు రాష్ట్రాలతో పాటు హిందీ, మలయాళ డబ్బింగ్ రైట్స్ తీసుకున్న పంపిణీదారులు, బయ్యర్లు తీవ్రంగా ‘రుద్రమదేవి’ చిత్రం వల్ల నష్టపోయారు అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.ఇక రుద్రమదేవి చిత్రానికి పోటీగా రేపు ‘బ్రూస్లీ’ చిత్రం విడుదల అవ్వనున్న విషయం తెల్సిందే.
దాంతో ‘రుద్రమదేవి’ కలెక్షన్స్ పూర్తిగా డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది.గుణశేఖర్ నష్టం కొద్దిగా తగ్గినా, బయ్యర్లు మాత్రం కోట్లల్లో నష్టాన్ని మూట కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
మరి బయ్యర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు గుణశేఖర్ ఏమని సర్థిచెబుతాడో చూడాలి.