ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి మరణం తెలుగు సినిమా పరిశ్రమను, ఆయన అభిమానులను తీవ్రంగా కలిసి వేచిన విషయం తెల్సిందే.ఆయన మరణం తర్వాత ఆయన కుటుంబ సభ్యుల మద్య ఉన్న విభేదాలు భగ్గుమన్నాయి.
చక్రిని ఆయన భార్య శ్రావణి చంపేసిందంటూ చక్రి తల్లి మరియు సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది.చక్రిని చంపేశానంటూ శ్రావణి తనకు ఫోన్ కూడా చేసి చెప్పిందని ఆమె ఫిర్యాదులో ఆరోపించింది.
ఆ సాక్ష్యాలు కూడా తన వద్ద ఉన్నాయని చక్రి తల్లి పేర్కొంది.మరో వైపు శ్రావణి కూడా చక్రి మరణానికి ఆయన తల్లి కారణం అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
చక్రి మరణించిన ముందు రోజు రాత్రి ఆయన తల్లి, తమ్ముడుతో కలిసి బోజనం చేసి వచ్చాడని, వారే బోజనంలో విషం ఇచ్చి చంపి ఉంటారని శ్రావణి ఫిర్యాదులో పేర్కొంది.ఇరువురి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు విచారణ చేపట్టారు.
చక్రి హస్తికలను ఫోరెన్సిక్ నిపుణులు పరీక్షించారు.ఆ పరీక్షల్లో చక్రి సహజంగానే మరణించాడని, ఆ హస్తికల్లో ఎలాంటి విష పదార్థాలు బయట పడలేదని రిపోర్టు వచ్చింది.
చక్రి తల్లి మరియు భార్య శ్రావణిల అనుమానాలు నిజం కాదని ఫోరెన్సిక్ నిపుణులు తేల్చి చెప్పారు.