లగడపాటి రాజగోపాల్ అలియాస్ ఆంధ్రా ఆక్టోపస్ పేరు అందరికి సుపరిచితమే.ఆయన రాజకీయ సర్వేలు చేయించడంలో దిట్ట.
అందుకే ఆయనకు అంత డిమాండ్.రాజకీయ పార్టీలు, నేతలు ఆయన చుటూ తిరుగుతూ తమ రాజకీయ జాతకం ఎలా ఉందో చెప్పమని తిరుగుతుంటారు.
ఆయన చేయించిన సర్వేలు తెలంగాణ మినహా మిగతా అన్నిచోట్లా ఫలితాలకు దగ్గరగా ఉండడంతో ఆయన చేయించే సర్వేలకు అంత క్రెడిబులిటీ వచ్చింది.ఇప్పుడు ఏపీలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల మధ్య సమరం తీవ్ర స్థాయిలో ఉంది.
హోరాహోరీగా జరుగుతున్న ఈ పోరులో తమ విజయం ఎవరిది అని తెలుసుకునేందుకు అంతా ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ఏపీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయంపై అనేక సోషల్ మీడియాలో సర్వేలు విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.
ఏప్రిల్ 11వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికలను పురస్కరించుకొని లగడపాటి సర్వేలు అంటూ కొన్ని పోస్టింగ్లు చక్కర్లు కొట్టడం హాట్ టాపిక్ గా మారింది. అంతే కాకుండా ఈ సర్వేల్లో వైసీపీకి ఆధిక్యం ఉందని ప్రచారం సాగుతోంది.ఈ ఈనికలపై తాను కూడా సర్వే చేయిస్తున్నామని , ఈ సర్వే ఫలితాలను ఎన్నికల తరువాత విడుదల చేస్తామని లగడపాటి రాజగోపాల్ ఇప్పటికే ప్రకటించినా ఈ వదంతులు ఆగడంలేదు.
తెలంగాణ ఎన్నికల సమయంలో కూడ లగడపాటి సర్వేల పేరుతో ఇలానే సోషల్ మీడియాలో పోస్టులను చూసి ఆయన స్పందించారు.అయితే ఎన్నికలకు ముందు, పోలింగ్ రోజున లగడపాటి రాజగోపాల్ సర్వే వివరాలను బయటకి విడుదల చేశారు.ఆ సర్వే ఫలితాలకు భిన్నంగా ఫలితాలు రావడంతో లగడపాటి సర్వేల మీద అందరికీ సందేహాలు తలెత్తాయి.ఇప్పుడు ఏపీ ఎన్నికల ఫలితాలు గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడం వెనుక ఎవరున్నారు అనే కోణంలో అనేక విశ్లేషణలు జరుగుతున్నాయి.