ఏపీలో రాజకీయం రోజు రోజుకి పీక్ స్టేజి కి వెళ్ళిపోతోంది.రాజకీయాల్లో తానొక కొత్త వొరవడికి నాంది పలుకుతాను అని చెప్పి తానే మారిపోయిన పరిస్థితి జనసేనానిది.
మొదట్లో ప్రగల్భాలు పలికేసి తనపై ప్రజలకి ఉన్న కొద్దో గొప్పో సాఫ్ట్ కార్నర్ ని వాడేకున్న పవన్, చంద్రబాబు కి అనుకూలంగా వ్యవహరిస్తున్న తీరుతో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో జోకర్ గా మారిపోయాడు అనే టాక్ వినిపిస్తోంది.అంతేకాదు ఇప్పుడు పవన్ టీడీపీ కి తొత్తులా వ్యవహరిస్తున్నాడు అంటూ సొంత పార్టీ అభిమానులే కామెంట్స్ చేస్తున్న పరిస్థితి నెలకొంది.
అయితే టీడీపీ వైసీపీలు ఎన్ని తిట్టుకున్నా, తన్నుకున్నా అవేమి లెక్కలోకి తీసుకొని ప్రజలు పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా ఊసరవెల్లి లా తన బుద్దిని మార్చుకోవడంతో పవన్ పై ప్రజల్లో వ్యతిరేకత మొదలయ్యింది.ఎన్నో సూత్రాలు, ఎన్నో నీతులు, మరెన్నో డైలాగులు మధ్య సాగిపోతున్న తన రాజకీయ రాజ మార్గానికి పవన్ కళ్యాణ్ తన స్వయంకృతాపరాధం తో బ్రేకులు వేసుకుంటున్నాడు.
విలువలకి నీళ్ళు వదిలేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయ రంగస్థలం మీద అటూ ఇటూ కాలు వేసి నిలిచున్నాడు.
ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో జగన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డ పవన్ .ఆ తరువాత గుంటూరు వేదికగా చంద్రబాబు పై విరుచుకు పడ్డాడు.కొంత కాలం చంద్రబాబు, లోకేష్ లపై ఫైర్ అవుతూ వచ్చిన పవన్ కళ్యాణ్ మళ్ళీ ఒక్క సారిగా మొన్నటి రాజమండ్రి సభా వేదికగా మళ్ళీ జగన్ పై విరుచుకు పడ్డాడు.
జగన్ కి ఓటు వేస్తే కేసీఆర్ కి ఓటు వేసినట్టే అంటూ కొత్త రాగం మొదలు పెట్టాడు.అసలు ఏపీ రాజకీయాల్లో ఇన్ని రంగులు మార్చిన ఏకైక వ్యక్తిగా పవన్ నిలిచిపోయాడు.
ఇక్కడ మరొక విశేషం ఏమిటంటే.
టీడీపీ జగన్ పై ఎలాంటి ఆరోపణలు అయితే చేస్తూ వచ్చిందో ఇప్పుడు అదే తరహా ఆరోపణలు పవన్ చేయడంతో పవన్ చంద్రబాబు ల ముసుగు తొలగిపోయింది అంటున్నారు విమర్శకులు.రాజకీయాల్లో మార్పు తెస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ కొత్తగా చేస్తోంది ఏముంది.ప్రచారంలో అందరిలానే ప్రత్యర్ధులపై విమర్శలు చేస్తున్నాడు.
ఉన్నవి, లేనివి చెప్తూ మరొక నాయకుడికి లబ్ది చేకూర్చుతున్నాడు, పబ్బం గడుపుతున్నాడు అంతకు మించి పవన్ కొత్తగా ఏమి చేస్తున్నాడు.
పవన్ ప్రవరిస్తున్న తీరుతో విసిగిపోతున్న ప్రజలు అసలు నిన్నెలా నమ్మడం అంటూ ఆత్మపరిశీలన చేసుకుంటున్నారట.
జాతీయ జెండాకి ఉన్న పొగరు తెగువ అంటూ ఏదేదో చెప్పేస్తే సినిమాల్లోగా చప్పట్లు వస్తాయి, కానీ ఓట్లు పడవు అనే వివరం మర్చిపోయి మరీ రెచ్చి పోతున్న పవన్ కళ్యాణ్ కి త్వరలో విజ్ఞులు అయిన ప్రజలు బుద్ది చెప్పడం ఖాయం అంటున్నారు రాజకీయ పండితులు.