కొత్త 'మా' అధ్యక్షుడిని ప్రమాణ స్వీకారం రోజే హెచ్చరించిన పాత అధ్యక్షుడు

రాజకీయ ఎన్నికలను తలపించిన ‘మా’ ఎన్నికల పక్రియ ముగిసింది.ఎన్నికల తర్వాత కూడా ఓడిపోయిన శివాజీ రాజా మరియ గెలిచిన నరేష్‌ల మద్య మాటల యుద్దం జరిగింది.

 Old Maa President Warned New President On The Day Of Sworn Oath-TeluguStop.com

ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు.శివాజీ రాజా తన టైం అయిపోలేదు అప్పుడే రాజీనామా చేయను అంటూ భీష్మించుకు కూర్చోగా, నరేష్‌ మాత్రం ప్రమాణ స్వీకారం చేస్తాను అంటూ పట్టుబట్టి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది.

మొత్తానికి నరేష్‌ మా కొత్త అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది.

ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో కొత్తగా ఎన్నికైన సభ్యులతో పాటు కృష్ణ దంపతులు మరియు కృష్ణం రాజు దంపతులు, బాలసుబ్రమణ్యం, జయసుధ ఇంకా పలువురు ప్రముఖులు మరియు మాజీ అధ్యక్షుడు కూడా పాల్గొన్నారు.

ఈ సందర్బంగా కొత్త అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేసి తప్పకుండా మా అభివృద్దికి తోడ్పాటును అందిస్తాను అంటూ ప్రకటించాడు.ఇదే సమయంలో పలువురు మాట్లాడుతూ మా లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తామంటూ హామీ ఇచ్చారు.

ఇదే సమయంలో మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా మాట్లాడుతూ కొత్త అధ్యక్షుడు నరేష్‌ను సున్నితంగా హెచ్చరించాడు.తాను అధ్యక్షుడిని అయిన తర్వాత మా మూల ధనంను భారీగా పెంచాను.తాను ఒక్క రూపాయి కూడా మూల ధనం నుండి తీయలేదు.ఇప్పుడు కొత్త అధ్యక్షుడు కూడా మూల ధనం నుండి ఒక్క రూపాయి తీయకుండా దాన్ని 10 కోట్లకు పెంచాలని సూచించాడు.

నిధులు సేకరించడంలో తాను చాలా క్రియాశీలకంగా వ్యవహరించానని కూడా శివాజీ రాజా అన్నాడు.మొత్తానికి కొత్త అధ్యక్షుడికి సున్నితంగా వార్నింగ్‌ ఇచ్చిన శివాజీ రాజా మరోసారి చర్చనీయాంశం అయ్యాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube