యంగ్ హీరో విజయ్ దేవరకొండ నిన్న హోలీ పండుగను కుటుంబ సభ్యులతో కలిసి చాలా సరదాగా గడుపుకున్నాడు.ఈ సందర్బంగా ఆయన రంగుల వల్ల కాస్త అనారోగ్యం పాలయినట్లుగా సమాచారం అందుతోంది.
నీటిలో ఎక్కువగా నానడంతో పాటు, రంగు ఎలర్జీ వచ్చిన కారణంగా కాస్త అస్వస్థత అయ్యాడని, దాంతో వెంటనే హాస్పిటల్లో జాయిన్ అయినట్లుగా సమాచారం అందుతోంది.నీరసంగా ఉండటంతో పాటు కాస్త జ్వరంగా ఉందని విజయ్ దేవరకొండను ట్రీట్ చేసిన వైధ్యులు వెళ్లడించారు.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఆరోగ్యం నిలకడగానే ఉందని, వెంటనే ఆయన్ను హాస్పిటల్ నుండి ఇంటికి పంపించినట్లుగా వైధ్యులు చెప్పిన నేపథ్యంలో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.చిన్న అనారోగ్యమే కదా అని అశ్రద్ద చేయకుండా జ్వరం అయినా కూడా హాస్పిటల్కు వెళ్లినట్లుగా దేవరకొండ కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
నటి నుండి రెగ్యులర్ షూటింగ్లో పాల్గొనాల్సి ఉంటుందని, అందుకే ఆరోగ్యం విషయంలో అజాగ్రత్తతో ఉండటం మంచిది కాదనే ఉద్దేశ్యంతో హాస్పిటల్కు వెళ్లినట్లుగా తెలుస్తోంది.
త్వరలో డియర్ కామ్రేడ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విజయ్ దేవరకొండ మరో వైపు హీరో అనే చిత్రంలో నటించడంతో పాటు, క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నాడు.ఈ రెండు సినిమాలు కూడా సమాంతరంగా తెరకెక్కుతున్నాయి.వరుసగా చిత్రాల్లో నటిస్తున్న విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మరోసారి మ్రోగించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు
.