కర్నూల్ జిల్లాలో దారుణం! ఆర్ధిక ఇబ్బందులతో కుటుంబ మొత్తం ఆత్మహత్య

కర్నూల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.ఆర్ధిక బాధలు తాళలేక ఓ కుటుంబంలో భార్య భర్తలు తమ ఇద్దరు పిల్లలు సహా అందరూ ఒకే సారి ఆత్మహత్య చేసుకున్నారు.

 4 Family Mumbers Suicide In Karnool District-TeluguStop.com

ఇప్పుడు ఈ సంఘటన చుట్టుపక్కల ప్రాంతాలలో సంచలనంగా మారింది.నంది కొట్కూరు పట్టణం, బుడగాజంగం కాలనీలో ఈ సంఘటన జరిగింది.

వివరాల్లోకి వెళ్తే జంగాల రుద్రాక్ష రామాంజనేయులు, ఆయన భార్య వసంత గత కొంత కాలంగా ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్నట్లు తెలుస్తుంది.ఈ కారణంగా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న వాళ్ళు తమ ఏడేళ్ళ కుమార్తె, రామలక్ష్మి, ఐదేళ్ళ కుమారుడు రాజేష్ తో సహా ఉరి వేసుకొని ఆత్మహత్యకి పాల్పడ్డారు.

స్థానికులు వీరి ఆత్మహత్యలని గుర్తించి పోలీసులకి సమాచారం అందించారు.పోలీసులు సంఘటన స్థలంకి చేరుకొని కేసు నమోదు చేసి వారిని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube