కర్నూల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.ఆర్ధిక బాధలు తాళలేక ఓ కుటుంబంలో భార్య భర్తలు తమ ఇద్దరు పిల్లలు సహా అందరూ ఒకే సారి ఆత్మహత్య చేసుకున్నారు.
ఇప్పుడు ఈ సంఘటన చుట్టుపక్కల ప్రాంతాలలో సంచలనంగా మారింది.నంది కొట్కూరు పట్టణం, బుడగాజంగం కాలనీలో ఈ సంఘటన జరిగింది.
వివరాల్లోకి వెళ్తే జంగాల రుద్రాక్ష రామాంజనేయులు, ఆయన భార్య వసంత గత కొంత కాలంగా ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్నట్లు తెలుస్తుంది.ఈ కారణంగా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న వాళ్ళు తమ ఏడేళ్ళ కుమార్తె, రామలక్ష్మి, ఐదేళ్ళ కుమారుడు రాజేష్ తో సహా ఉరి వేసుకొని ఆత్మహత్యకి పాల్పడ్డారు.
స్థానికులు వీరి ఆత్మహత్యలని గుర్తించి పోలీసులకి సమాచారం అందించారు.పోలీసులు సంఘటన స్థలంకి చేరుకొని కేసు నమోదు చేసి వారిని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు.