పాకిస్తాన్ లో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థని నడుపుతూ నిత్యం భారత్ మీద విషయం వెళ్లగక్కే ఉగ్రవాది మసూద్ అజార్.పుల్వామా ఉగ్రదాడి వెనుక కూడా మసూద్ అజార్ హస్తం ఉందనే విషయం అందరికి తెలిసిందే.
ఆ దాడి చేసింది తామే అని జైషే ప్రకటించింది.అదే సమయంలో ఇండియాపై జిహాదీ యుద్ధం చేయాలని మసూద్ ముస్లిం లని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే అంతర్జాతీయంగా యునెస్కోలో శాశ్వత సభ్యదేశాల మద్దతుతో మసూద్ ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని భారత్ ప్రయత్నం చేస్తుంది.
అయితే మసూద్ ని ఉగ్రవాదిగా ప్రకటించే విషయంలో భారత్ కి చైనా పెద్ద అడ్డంకిగా మారింది.
ఎప్పటికప్పుడు ఆ దేశం మసూద్ ని వెనకేసుకొని వస్తుంది.తాజాగా మసూద్ ని ఉగ్రవాదిగా ప్రకటించే విషయంలో జర్మన్ కూడా వెనక్కి తగ్గింది.
అంతర్జాతీయంగా చైనాతో ఉన్న వాణిజ్య సంబంధమైన బంధం తెంచుకోవడం ఇష్టం లేక చైనాకి మద్దతుగా జర్మన్ నిలబడినట్లు తెలుస్తుంది.