ఈ నెల 23 నుంచి ఇండియన్ దేశవాళీ క్రికెట్ టోర్నీ అయిన ఐపీఎల్ సీజన్ మొదలు కాబోతుంది.తాజాగా బిసిసిఐ ఐపీఎల్ షెడ్యూల్ ప్రకటించింది.
మార్చి 23 నుంచి మొదలయ్యే ఐపీఎల్ మే 5 వరకు జరుగుతుంది.ఇక ఈ ఐపీఎల్ లో సత్తా చాటడం ద్వారా ప్రపంచ కప్ సెలక్షన్ కమిటీని ఆకర్షించాలని చాలా మంది యువ క్రికెటర్స్ భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే మాజీ టీం ఇండియా క్రికెటర్ గౌతం గంభీర్ కి విరాట్ కెప్టెన్సీ మీద మొదటి నుంచి అసంతృప్తి వుంది.
అవకాశం వచ్చిన ప్రతిసారి గౌతం విరాట్ ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూ ఉంటాడు.
ఇక ఈ సీజన్ లో బెంగుళూరు కెప్టెన్ గా ఉన్న విరాట్ ని టార్గెట్ గా చేసుకొని గౌతం మరో సారి విమర్శలు చేసాడు.విరాట్ ఉత్సాహవంతమైన కెప్టెన్ కాదని, అతనిలో ఆ ఈజ్ కనిపించదని గౌతం ఎద్దేవా చేసాడు.
ఈ కారణంగానే అతను ఇప్పటి వరకు ఐపీఎల్ విన్నర్ గా నిలవలేకపోయాడని చెప్పుకొచ్చాడు.అయితే బెస్ట్ కెప్టెన్ లు అంటే ధోని, రోహిత్ ని మాత్రమె నేను చెబుతా అంటూ చెప్పాడు.