ఏపీ ఎన్నికలలో ఓ వైపు టీడీపీ, బీజేపీ పార్టీలు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాయి.ఇప్పటికే మొత్తం అభ్యర్ధులని ప్రకటించిన రెండు పార్టీలు ఎన్నికల ప్రచారంపై ద్రుష్టి పెట్టాయి.
మరో వైపు మూడో ప్రత్యామ్నాయంగా ఎన్నికలలో దూసుకెళ్తున్న జనసేన పార్టీ కూడా ఎన్నికలు నామినేషన్ ప్రక్రియ దగ్గర పడుతున్న కొద్ది బలమైన అభ్యర్ధులని బరిలోకి దించే ప్రయత్నం చేస్తున్నారు.ఇప్పటికే చాలా నియోజక వర్గాలలో సత్తా చూపించే స్థాయిలో అభ్యర్ధులని దించిన జనసేనాని మూడో జాబితాని కూడా ప్రకటించింది.
విశాఖ పార్లమెంట్ అభ్యర్ధిగా జేడీ లక్ష్మినారాయణని బరిలో దించిన జనసేనాని, మరో వైపు బలమైన అభ్యర్ధులని వెతికే పనిలో పడ్డారు.అందులో భాగంగా గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఎర్రం వెంకటేశ్వర్ రెడ్డి జనసేన పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు.
ఆయనకి సత్తెనపల్లి నుంచి సీటు కేటాయించే అవకాశం ఉందని తెలుస్తుంది.మరో వైపు నద్యాల్ ఎంపీ ఎస్వీవై రెడ్డితో కూడా జనసేన సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తుంది.