యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా సాహో.యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.
ఇక ఆమె క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుంది అనే విషయం మేకింగ్ వీడియో తో చిత్ర దర్శకుడు స్పష్టం చేసాడు.
ఇదిలా ఉంటే ఇందులో మరో బాలీవుడ్ బ్యూటీ ఇండో-జర్మన్ యాక్టర్ ఎవలీన్ శర్మ ఓ కీలక పాత్రలో కనిపిస్తుంది అని తెలుస్తుంది.
ఈమె ప్రభాస్ ని విలన్ గా కనిపించాబోతుందని సమాచారం.ఇద్దరి మధ్య యాక్షన్ సీక్వెన్స్ కూడా చాలా పవర్ ఫుల్ గా ఉండబోతున్నాయి అనే టాక్ వినిపిస్తుంది.
ఇందులో మెయిన్ విలన్ గా నీల్ నితిన్ ముఖేష్ నటిస్తు ఉండగా అతని గ్యాంగ్ లో ఎవలీన్ శర్మ ఉంటుంది అని సమాచారం.