ఏపీలో ఈ సారి కమ్యూనిస్ట్ పార్టీలు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీతో పొత్తు పెట్టుకొని ఎన్నికల బరిలోకి వెళ్తున్నారు.ఇప్పటి వరకు అధికార, ప్రతిపక్ష పార్టీలలో ఏదో ఒకదానితో పొత్తు పోట్టుకొని వాడు అడిగే ఒకటి అర సీట్లతో సర్దుకోవాల్సి వచ్చే కమ్యూనిస్ట్ పార్టీలు ఈ సారి మూడో ప్రత్యామ్నాయంగా ఉన్న జనసేనతో పొత్తు పెట్టుకోవడం ద్వారా మార్పుకి స్వాగతం పలికాయి.
ఇదిలా ఉంటే పొత్తులో భాగంగా ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెరో ఏడు అసెంబ్లీ సీట్లు, రెండు పార్లమెంట్ సీట్లు కేటాయించారు.దీంతో కమ్యూనిస్ట్ పార్టీలు రెండు అభ్యర్ధుల జాబితాపై కసరత్తు చేస్తున్నాయి.
తాజాగా సిపిఐ పార్టీ ఆరు అసెంబ్లీ సీట్లకి అభ్యర్ధులని ప్రకటించింది.మిగిలిన రెండు లోక్ సభ సీట్లతో పాటు, ఒక అసెంబ్లీ సీటుని ప్రకటించాల్సి ఉంది.
మరి ఈ ఎన్నికలలో జనసేనతో కలిసి ముందుకి వెళ్తున్న కమ్యూనిస్ట్ పార్టీలు ఎ స్థాయిలో తమ సత్తా చూపిస్తాయి అనేది ఈ ఎన్నికలలో స్పష్టం అయిపోతుంది.