మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అరవింద సమేత లాంటి సూపర్ హిట్ తర్వాత బన్నితో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు.ఇక నా పేరు సూర్య తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్న బన్ని కూడా త్రివిక్రమ్ హిట్ కొట్టగానే అతనితో సినిమాని అనౌన్స్ చేసేసాడు.
ఇక ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పై ఎన్ని రోజులు వర్క్ చేసిన త్రివిక్రమ్ తాజాగా స్టొరీ లాక్ చేసినట్లు తెలుస్తుంది.ఇక ఈ సినిమాని కూడా త్రివిక్రమ్, బన్ని కాంబినేషన్ లో వచ్చిన గత సినిమా తరహాలో ఫాదర్ సెంటిమెంట్ తోనే ఆవిష్కరిస్తున్నట్లు తెలుస్తుంది.
ఇదిలా ఉంటే తాజాగా త్రివిక్రమ్ ఈ సినిమాకి టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది నాన్న నేను అనే టైటిల్ ని ఈ సినిమా కోసం అనుకుంటున్నట్లు తెలుస్తుంది.ఇక బన్నికి కూడా ఈ టైటిల్ భాగా కనెక్ట్ కావడంతో దీనిని ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా డీజే బ్యూటీ పూజా హెగ్డేని త్రివిక్రమ్ ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.త్రివిక్రమ్, బన్నిలతో ఈ మంగళూరు భామకి ఇది రెండో సినిమా కావడం విశేషం.
మరి ఈ సినిమా బన్నికి ఎ స్థాయిలో హిట్ ఇస్తుంది అనేది చూడాలి.