బీజేపీ సీనియర్ నాయకులు, గోవా సిఎం మనోహర్ పారికర్ మరణించిన సంగతి అందరికి తెలిసిందే.ఈ నేపధ్యంలో మనోహర్ పారికర్ అంత్యక్రియలు కూడా ఈ రోజు సాయంత్రం పూర్తయ్యాయి.
ఇక అధికార పార్టీ బీజేపీ గోవాలో తదుపరి ముఖ్యమంత్రి అభ్యర్ధిపై తీవ్ర కసరత్తు చేసాయి.చివరికి గోవా అసెంబ్లీ స్పీకర్ గా ఉన్న ప్రమోద్ సావంత్ ని ముఖ్యమంత్రి అభ్యర్ధిగా బీజేపీ అధినాయకత్వం నిర్ణయించింది.
మనోహర్ పారికర్ మరణంతో ఒక్కసారిగా గోవాలో రాజకీయాలు వేడెక్కాయి.కాంగ్రెస్ పార్టీ గవర్నర్ ని కలిసి ప్రభుత్వం ఏర్పాటుకి అవకాశం ఇవ్వాలని కోరారు.అయితే బీజేపీకి మద్దతు ఇచ్చిన ఇండిపెండెంట్ అభ్యర్ధులు కూడా బీజేపీకే మద్దతు ప్రకటించడంతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకి సిద్ధం అయ్యింది.దీంతో హుటాహుటిన ప్రమోద్ సావంత్ ని ముఖ్యమంత్రి అభ్యర్ధిగా నిర్ణయించి, ఈ రాత్రికే ప్రమాణ స్వీకారం చేయించేందుకు సిద్ధం అయ్యారు.