టెక్నాలజీ విపరీతంగా పెరిగి పోయిన నేపథ్యంలో ప్రపంచం మొత్తం ఒక కుగ్రామంగా మారిపోయింది.ప్రపంచంలోని ఏ మూలన ఉన్న వ్యక్తితో అయిన ఏ మూల నుండి అయినా మాట్లాడే టెక్నాలజీ వచ్చింది.
అది కూడా చూసుకుంటూ అంటే వీడియో కాలింగ్స్ అందుబాటులోకి వచ్చాయి.పరిగిన మొబైల్ సేవలు మరియు ఇతరత్ర టెక్నాలజీతో మనుషులు వేరు వేరు దేశాల్లో ఉంటున్నా కూడా పక్కనే ఉన్నట్లుగా అనిపిస్తుంది.
అత్యంత ప్రాచుర్యం పొందిన టెక్నాలజీ వల్ల ఇప్పుడు అందరు చాలా వరకు ఉపయోగాలు పొందుతున్నారు.కాని ఇదే టెక్నాలజీ వల్ల కొందరు నష్ట పోవడం, కాలాన్ని వృదా చేయడం చేస్తున్నారు.
ఒక మహిళ ఈ టెక్నాలజీని సరిగా ఉపయోగించని కారణంగా తన జీవితాన్ని నాశనం చేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే…
మహారాష్ట్రకు చెందిన ఒక మహిళ తన భర్తతో దూరంగా ఉంటుంది.
ఆమె భర్త విదేశాల్లో ఉద్యోగ రీత్యా ఉంటున్నాడు.గత మూడు నాలుగు సంవత్సరాలుగా వీరిద్దరు విడి విడిగానే ఉంటున్నారు.
అయితే వాట్సప్ వీడియో కాలింగ్ ద్వారా వీరిద్దరు మాట్లాడుకునే వారు.అప్పుడప్పుడు న్యూడ్ గా కూడా వీడియో కాలింగ్ చేసుకునే వారు.
ఒకరికి ఒకరు దూరంగా ఉంటున్న కారణంగా భార్య భర్తలు అప్పుడప్పుడు న్యూడ్ గా మాట్లాడుకునేందుకు ఆసక్తి చూపించేవాడు.అయితే భర్త న్యూడ్ వీడియోలు పంపించాల్సిందిగా భార్యకు సూచించాడు.
అయితే వాట్సప్ లో అది సాధ్యం కాని కారణంగా ఫేస్బుక్ మెసెంజర్ లో సెండ్ చేయాలని చెప్పాడు.
ఫేస్బుక్ మెసెంజర్ సరిగా వినియోగించడం రాని ఆ మహిళ వీడియో రికార్డింగ్ చేసి మెసెంజర్లో చేస్తున్నా అనుకుని ఫేస్ బుక్ లైవ్ లో నగ్నంగా కనిపించింది.దాదాపు పది నిమిషాల పాటు నగ్న వీడియో సోషల్ మీడియా అయిన ఫేస్ బుక్ లో షేర్ అయ్యింది.దాదాపు రెండు వేల మంది ఆ వీడియోను చూశారు.
ఆ విషయం ఆమెకు తెలిసి డిలీట్ చేసేప్పటికి అంతా జరిగి పోయింది.ఆమె కొడుకు మరియు ఇతర కుటుంబ సభ్యులు చాలా మంది ఆమె వీడియోను చూడటం ఆమెపై కోపంను వ్యక్తం చేయడం చేశారు.
కొడుకు అసలు ఆమెతో మాట్లాడేందుకు ఆసక్తి చూపడం లేదు, ఆమె తల్లిదండ్రులు కూడా తమ పరువు తీశావు అంటూ ఆమెను దూరం చేస్తున్నారు.చివరకు భర్త కూడా ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
దాంతో ఆమె కుమిలి పోతుంది.తెలియక చేసిన టెక్నికల్ తప్పుతో మొత్తం జీవితం మారిపోయింది.
.