లోక్ సభ ఎన్నికలలో ప్రధాని మోడీ మరో కొత్త నినాదం తెరపైకి తీసుకొచ్చాడు.ఈ సారి కూడా ఎలా అయిన అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్న బీజేపీ పార్టీ తన ఎన్నికల ప్రచారాన్ని విస్తృతం చేసింది.
మరో వైపు ప్రతిపక్ష పార్టీ అధినేత రాహుల్ తనదైన శైలిలో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాడు.అయితే రాహుల్ ఎన్నికల ప్రచారంలో మోడీని ఉద్దేశించి కొన్ని వ్యంగ్యమైన వాఖ్యలు చేసాడు.
అందులో చౌకీదార్ అనే పదాన్ని ప్రముఖంగా వాడారు.ఇప్పుడు అదే మాటని బీజేపీ పార్టీ తన ఎన్నికల ప్రచారానికి వాడుకుంటుంది.
సోషల్ మీడియాతో ఎక్కువగా ఓటర్స్ ని ప్రభావితం చేసే బీజేపీ పార్టీ నేతలు అందరూ ఇప్పుడు తమ ట్విట్టర్ ఎకౌంటులో పేరుకి ముందు చౌకీదార్ అని పేరు తగిలించుకున్నారు.కష్టపడే ప్రతి వ్యక్తి, దేశానికి కాపలా కాసే ప్రతి వ్యక్తి చౌకీదార్ అంటూ నినాదం ఎత్తుకున్నారు.
బీజేపీ అందుకున్న ఈ నినాదం ఇప్పుడు ప్రజలలోకి చాలా వేగంగా దూసుకెళ్తుంది.మరి మోడీ తన చౌకీదార్ ప్రచారం ఎంత వరకు అతనికి కలిసి వస్తుంది అనేది ఇప్పుడు దేశ రాజకీయాలలో ఆసక్తిగా మారింది.